అర్హులైన ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలి

తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మంచిర్యాల జిల్లా కార్యదర్శి కొండు బానేష్

మంచిర్యాల, నేటి ధాత్రి:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి ఆదాయ పరిమితి లేకుండా అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు జారీ చేసి హెల్త్ కార్డు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది.ప్రజా ప్రతినిధుల సలహాలు,సూచనలు కాకుండా కొత్త రేషన్ కార్డుల మంజూరు చేసే విధానంలో ప్రజలను భాగస్వామ్యం చేసి వారి యొక్క సమస్యలను తెలుసుకొని ప్రజలకు మేలు చేయాలని అన్నారు.ప్రజలు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని రాష్ట్రంలో నిరుద్యోగంతో యువత నిరుపేదలుగా ఉంటున్నారని అలాగే ఏదైనా జబ్బులతో అనారోగ్య పాలైనప్పుడు కార్పొరేట్ వైద్యం చేయించుకోలేని నిస్సహాయకులుగాల్ మిగిలిపోతున్నారు.అందరికీ హెల్త్ కార్డులు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాము.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *