దుర్గామాతకు మొక్కిన మొక్కును తీర్చుకున్న ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి

రామాయంపేట (మెదక్) నేటి ధాత్రి.

దుర్గామాత యూత్ అసోసియేషన్ వారికి ఎమ్మెల్యే లక్ష రూపాయలు అందజేత

మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో దుర్గామాత శోభాయాత్రలో ఆదివారం ముఖ్యఅతిథిగా దుబ్బాక నియోజకవర్గం ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం అమ్మవారి ముందు గుమ్మడి కాయకొట్టి గత సంవత్సరంలో అమ్మవారికి మొక్కిన మొక్కు ను తీర్చుకున్నారు.ఆయన మొక్కులో భాగంగా దుర్గ మాత పూజలో దుర్గ మాత యూత్ అసోసియేషన్ వారికి దుబ్బాక నియోజకవర్గం ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి లక్ష రూపాయలు అందజేశారు. దుర్గామాత అసోసియేషన్ యూత్ వారు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి, శాలువాలతో సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి డాక్టర్ చారి హాస్పిటల్ లో హర్షవర్ధన్ ను శాలువతో సన్మానించారు. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ….. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, ప్రతి పనిలో విజయం కలగాలని దుర్గామాత అమ్మవారి ఆశీస్సులు అందరి పైన చిరకాలం ఉండాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో దుర్గామాత యూత్ అసోసియేషన్ వారు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *