
Ghantaramam Ravinder, Udayam Reporter.
నూతన ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ సీడ్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీని సన్మానించిన పాత్రికేయులు
పరకాల,నేటిధాత్రి
పరకాల ఎరువులు పురుగుమందులు మరియు విత్తనముల డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా అరుణ ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ సీడ్స్ ప్రొప్రైటర్ గందె వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శిగా నవత బ్రదర్స్ శివాజీని, కోశాధికారి గా మల్లికార్జున ట్రేడర్స్ ఎర్ర లక్ష్మణ్ ఏకగ్రీవంగా ఎన్నుకోగా పరకాల విలేకరుల తరఫున మర్యాదపూర్వకంగా కలిసి వారిని శాలువాతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పరకాల పాత్రికేయులు ఘంటారామం రవీందర్,ఉదయం దినపత్రిక రిపోర్టర్ రాజు,నేడు సందీప్,నేటిదాత్రి రిపోర్టర్ అంబేద్కర్ ల్,వరంగల్ వాయిస్ రిపోర్టర్ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.