స్వకృషి ఉద్యమంలో నూతన కంప్యూటరీకరణ.

Development Development

స్వకృషి ఉద్యమంలో నూతన కంప్యూటరీకరణ.

సహకార సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ద్వారా గ్రామాల అభివృద్ధి.

సహవికాస సంస్థ మేనేజర్ లక్ష్మణ్..

విజయవంతంగా దుగ్గొండి పురుషుల పొదుపు సమితి వార్షిక మహాసభ..

నర్సంపేట,నేటిధాత్రి:

 

స్వకృషి ఉద్యమంలో నూతన కంప్యూటరీకరణ వలన సంఘాల్లో సభ్యులకు ఎంతగానో మేలు జరుగుతున్నదని సహవికాస సంస్థ మేనేజర్ లక్ష్మణ్ తెలిపారు.దుగ్గొండి మండల కేంద్రంలో గల
దుగ్గొండి పురుషుల పొదుపు సమితి అధ్యక్షులు మహమ్మద్ ఉస్మాన్ అధ్యక్షతన ఆ సమితి 12 వ వార్షిక మహాసభ కార్యాలయం ఆవరణలో జరిగింది.సమితి పరిధిలోని దుగ్గొండి,చంద్రయ్యపల్లి,దేశాయిపల్లి, రేబల్లె,వెంకటాపురం,నేరేడుపల్లి,

 

Development

వసంతాపురం,ప్రగతిసింగారం,అక్కంపేట అనే 10 సంఘాలు ఉండగా మొత్తం 4382 మంది సభ్యులు కాగా మొత్తం రూ.10 కోట్ల నిధులు ఉన్నాయి.సమితి నిర్వహణ పట్ల స్థితిగతులు,అభివృద్ధి పట్ల చర్చించుకున్నారు.ఈ నేపథ్యంలో 2024-25 వార్షిక నివేదికను అధ్యక్షుడు మహమ్మద్ ఉస్మాన్,గణకులు పోలోజు రమణాచారిలు చదివి ప్రవేశపెట్టారు.ముఖ్య అతిథిగా పాల్గొన్న సహకార వికాస సంస్థ మేనేజర్ లక్ష్మణ్ మాట్లాడుతూ గ్రామాల్లో సహకార సంఘాలు,స్వచ్ఛంద సంస్థలు మంచిన నడిస్తే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఉద్దేశ్యంతో సహకార వికాస సంస్థ ఏర్పాటు చేయగా నేడు స్వకృషీ ఉద్యమం వజయవంతంగా నడుస్తున్నాయని తెలియజేశారు.
1995 చట్టం ద్వారానే రాజకీయ పార్టీలకతీతంగా సహావికాస సంస్థ సంఘాలు అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొన్నారు.

 

Development

సహకార ఉద్యమంలో 54 సమితిలు ఉండగా సేవా దృక్పథంతో నిర్వహణలో ఉన్నాయని తెలిపారు.సిడీఎఫ్ ధర్మకర్తల మండలి ప్రతినిధి దర్మవతి మాట్లాడుతూ సంఘాల అభివృద్ధికి పాలకవర్గ సభ్యులు కృషి కీలకమని అన్నారు.రానున్న రోజుల్లో సభ్యులు ,సంఘాలు ఇబ్బందులు పదద్దనే ఉద్దేశ్యంతో సహావికాస కార్యశాల నిర్ణయించిందని దీంతో కొన్ని ఖాతాలు నిలిపివేసిందని తెలియజేశారు.సిడీఎఫ్ అభివృద్ధి అధికారి నవీన్ మాట్లాడుతూ సంఘాల్లో బకాయి శాతం జీరో చేస్తేనే మెరుగు లభిస్తుంది అని పేర్కొన్నారు.అనంతరం చంద్రయ్యపల్లి,వసంతాపూర్, కమ్మపెల్లి,ప్రగతిసింగారం సంఘాలకు ఉత్తమ సంఘాలుగా ఎన్నిక కాగా మరో నలుగురిని ఉత్తమ పాలకవర్గ సభ్యులుగా ఎంపిక కాగా వారికి అవార్డులు అందజేశారు.ఈ కార్యక్రమంలో
సమితి ఉపాధ్యక్షుడు కందికొండ రవీందర్,సంఘాల అధ్యక్షులు,సమితి పాలకవర్గ సభ్యులు కందుల శ్రీనివాస్ గౌడ్, మోతుకూరి ప్రభాకర్,పెద్దిరెడ్డి మహేందర్ రెడ్డి,బట్టి బక్కయ్య,పొగాకు రమేష్ గౌడ్,వేములపల్లి బాబు,పెండ్యాల మల్లేశం,రాయరాకుల రమేష్,ప్రేమ్ సాగర్,ఆయా సంఘాల ఉపాధ్యక్షులు,పాలకవర్గ సభ్యులు,గణకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!