సింగరేణిలో నూతన బొగ్గు బాయిలు ఏర్పాటు చేయాలి..

సింగరేణిలో నూతన బొగ్గు బాయిలు ఏర్పాటు చేయాలి

తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కామెర గట్టయ్య

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి పట్టణంలోని బాతల రాజన్న భవన్ తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది
ఈ సమావేశాన్ని ఉద్దేశించి తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కామెర గట్టయ్య
మాట్లాడుతూ సింగరేణి వ్యాప్తంగా 21 అండర్ గ్రౌండ్ లో నడుస్తున్నాయి గత మూడు సంవత్సరాల కాలం నుండి సింగరేణి అధికారులు అండర్ గ్రౌండ్ గనులు లాస్ లో నడుస్తున్నాయని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు
ఈ ప్రచారం యొక్క ముఖ్య ఉద్దేశం అండర్ గ్రౌండ్ బొగ్గు గనులను లాసు చూపించి భవిష్యత్తులో ఓపెన్ కాస్ట్ గనులుగా మార్చే కుట్ర జరుగుతుందని కార్మిక వర్గం ఆందోళన గురవుతుంన్నారు
గత నాలుగు నెలల క్రితం బలరాం నాయక్ సింగరేణికి నూతనంగా సింగరేణి డైరెక్టర్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన అనంతరం సింగరేణి వ్యాప్తంగా అన్ని గనులలో పర్యటించిన సందర్భంగా అండర్ గ్రౌండ్ గనులు లాస్ లో నడుస్తున్నాయి అధిక బొగ్గు ఉత్పత్తి చేయాలంటే ఏం చేయాలని కార్మికులను అడిగి తెలుసుకోవడం జరిగింది ఇట్టి విషయంలో కార్మికులు క్లుప్తంగా డైరెక్టర్ కి కార్మికుల ఎదుర్కొంటున్న సమస్యలుచెప్పడం జరిగింది
SDL,LHD, యంత్రాలు పాతబడిపోయినాయి కొత్త యంత్రాలను సప్లై చేయాలని యంత్రాలకు సంబంధించిన స్పేర్ పార్ట్స్ నాసిరకం సప్లై చేస్తున్నారు అండర్ గ్రౌండ్ గనులకు స్టవింగ్ కోసం ఇసుక సప్లై కావడంలేదని ట్రబ్బులు తక్కువగా ఉన్నాయని కొత్త ట్రబుల్ సప్లై చేయాలని
అదేవిధంగా కార్మికులకు సంబంధించిన పనిముట్లు కూడ నాసిరకం సప్లై చేస్తున్నారని అనేక సమస్యలు డైరెక్టర్ దృష్టికి తీసుకురావడం జరిగింది ఇట్టి సమస్యలు అన్ని త్వరలో పరిష్కరిస్తామని చెప్పిన డైరెక్టర్ నాలుగు నెలల సమయం గడిచినప్పటికీ ఇప్పటివరకు పట్టించుకోకపోవడంలో అంతరాయం ఏమిటి ప్రతి సంవత్సరం సింగరేణి సంస్థకు కోట్లాది రూపాయల లాభాలు నస్తున్నయి అండర్ గ్రౌండ్ గనుల ను కంపెనీ ఎందుకు పట్టించుకోవడం లేదు
అంటే భవిష్యత్తులో అండర్ గ్రౌండ్ గనులు అన్నిటిని కూడా ఓపెన్ కాస్ట్ గనులుగా మార్చే కుట్ర జరుగుతుందని ఇప్పటికే ఉత్తర తెలంగాణలో 9 ఓపెన్ కాస్ట్ గనుల తోటి బొందల గడ్డలుగా తయారైంది పూర్తిస్థాయిలో అండర్ గ్రౌండ్ గనులు బంద్ చేసి ఓపెన్ కాస్ట్ గనులు తవ్వితే భవిష్యత్తులో భావితరాలకు ఉపాధి అవకాశాలు లేకుండా పోతాయని ఉత్తర తెలంగాణ ఎడారిగా మార్తదని రాష్ట్రప్రభుత్వం కంపెనీ ఇలాంటి ఆలోచనలను మానుకొని అండర్ గ్రౌండ్ గనులను పూర్తిస్థాయిలో నడపాలని భవిష్యత్తులో కూడా ఓపెన్ కాస్ట్ గనులు తీయకుండా నూతనంగా అండర్ గ్రౌండ్ గానులు తవ్వి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని గట్టయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని కంపెనీని డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు
దాసరి జనార్ధన్
కాసర్ల ప్రసాదరెడ్డి
నామాల శ్రీనివాస్
రాళ్ల బండి బాబు
జయశంకర్
ఎండి సాజిత్
యుగేందర్
నరసింహారెడ్డికి
లక్ష్మీనారాయణ
రవి
తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version