నూతన బీజేపీ జహీరాబాద్ పట్టణ కమిటీ నియామకం
◆ బీజేపీ జహీరాబాద్ పట్టణ అధ్యక్షులు పూల సంతోష్
జహీరాబాద్ నేటి ధాత్రి:
బీజేపీ జిల్లా అధ్యక్షులు గోదావరి
ఆదేశాల మేరకు అసెంబ్లీ కన్వీనర్ నౌబత్ జగనాథ్ సీనియర్ నాయకులు శ్రీనివాస్ గౌడ్ సుధీర్ భండారి బక్కాయ గుప్తా సమక్షంలో జహీరాబాద్ పట్టణ కమిటీని నియమించినట్లు జహీరాబాద్ పట్టణ అధ్యక్షులు పూల సంతోష్ గారు తెలిపారు ఈ సందర్భంగా పూల సంతోష్ మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పని చేయాలని నియమనిబంధన పాటించాలని రాబోయే స్థానిక జహీరాబాద్ మున్సిపల్ ఎన్నికలలో మెజార్టీ స్థానాలు గెలిచి మున్సిపల్ పై బీజేపీ జెండా ఎగిరి విధంగా ప్రతి పదాధికారి కార్యకర్త పని చేయాలని క్రమశిక్షణతో పార్టీకి చేయాలని కమిటీ సభ్యులను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది.