నూతన వ్యవసాయ పద్ధతులను అనుసరించాలి
మూస పద్ధతులను విడనాడాలి
రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు…. రైతులకు అవగాహన కార్యక్రమం
కేసముద్రం/ నేటి ధాత్రి
శనివారం కేసముద్రం రైతు వేదికలో ” రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” అను ప్రోగ్రాం ద్వారా రైతులకు శాస్త్రవేత్తలు పలు సూచనలు చేయడం జరిగింది. శాస్త్రవేత్తలు మాట్లాడుతూ రైతులకు ఈ విధమైన సలహాలు చేయడం జరిగింది
1. తక్కువ యూరియా వాడి సాగు ఖర్చు తగ్గించుకోవాలి
2. అవసరమేరకు మందులను పిచికారి చేసి మేలా ఆరోగ్యాన్ని కాపాడాలని
3. విత్తనాలు పురుగు మందుల మరియు ఎరువుల రసీదులు భద్రపరుచుకోవాలి
4. సాగునీటిని ఆదా చేసుకోవాలి
5. పంట మార్పిడి చేసుకోవాలి
6. చెట్లను పెంచి పర్యావరణాన్ని కాపాడుకోవాలి
7. పచ్చిరొట్ట ఎరువులు, పశువుల పెంట, చెరువు మట్టి వలన కలిగే ఉపయోగాలు.
వారు మాట్లాడుతూ వచ్చే వానకాలం సీజన్ 2025 -26
గాను వివిధ పంటలలో సాగు చేసే వివిధ రకాల విత్తనాలు మరియు మేలైన యాజమాన్య పద్ధతులు,
వరి పంటలో నేరుగా విత్తనాలు వెదజల్లి మంచి దిగబడులు పొందే మీద సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది.
రైతులు పురాతన మూస పద్ధతులను విడనాడి, నూతన వ్యవసాయ పద్ధతులను అనుసరించి, ఖర్చులను తగ్గించి మంచి దిగబడులు, పొందాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో, ముఖ్య అతిథులుగా
కెవికె మల్యాల ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, డాక్టర్, ఎస్. మాలతి , ప్రాథమిక వ్యవసాయ సహాయ సహకార సంఘం ధనసరి అధ్యక్షులు మర్రి రంగారావు, సహాయ వ్యవసాయ సంచాలకులు మహబూబాబాద్ డివిజన్ అజ్మీరా శ్రీనివాసరావు, కె వి కె మల్యాల శాస్త్రవేత్తలు డాక్టర్ రాంబాబు , డాక్టర్ క్రాంతి కుమార్ , మండల వ్యవసాయ అధికారి కేసముద్రం బి వెంకన్న, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు, తోట వెంకన్న, ఆయా గ్రామాల అభ్యుదయ రైతులు, మండలంలోని ఆయా క్లస్టర్ల వ్యవసాయ విస్తరణ అధికారులు, రాజేందర్, శ్రీనివాస్, రవివర్మ, సాయి చరణ్, లు పాల్గొన్నారు.