నేతకాని స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు గోగు సుధాకర్ కు ఎస్ సి కార్పొరేషన్ లో అవకాశం కల్పించాలి.

నేతకాని స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గం ప్రేమ్ కుమార్ డిమాండ్

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి గత కొన్ని సంవత్సరాలు అవుతున్న తెలంగాణ ప్రభుత్వం నేతకాని కులాన్ని గుర్తించక పోవడం చాలా సిగ్గు చేటుగా ఉంది .ఎస్ సి కులంలో ఒక మాల ,మాదిగ లే లేరు ,ఎస్ సి కులంలో చాలా కులాలు ఉన్నయీ అందులో నేతకాని సమాజం కూడా ఉంది .తెలంగాణ రాష్ట్రం లో కొన్ని లక్షల జనాభా ఉన్న నేతకాని కులాన్ని తెలంగాణ ప్రభుత్వం గుర్తించక పోవడం చాలా సిగ్గు చేటుగా ఉందని నేతకాని స్టూడెంట్ ఫెడరేషన్ మంచేరియల్ జిల్లా అధ్యక్షులు ముడిమడుల శేఖర్ అన్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం మా నేతకాని సమాజాన్ని గుర్తించి మా సమజానికి ఎస్ సి కార్పొరేషన్ లో నామినేటెడ్ పదవి ఇవ్వాలని ప్రభుత్వన్నీ డిమాండ్ చేశారు.మాల ,మాధిగలో పాటు మా సమాజాన్ని గుర్తించాలని అన్నారు.మా సమాజం రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి గోగు సుధాకర్ చాలా సంవత్సరాలు గా తెలంగాణ ఉద్యమంలో పనిచేశారని అన్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు స్పందించి మా నేతకాని సమాజాన్ని గుర్తించి ఎస్ సి కార్పొరేషన్ లో పదవి ఇవ్వాలని అన్నారు.లేని యెడల పెద్ద ఎత్తున్న ఆందోళ కార్యక్రమలు ఎన్ఎస్ఎఫ్ తరఫున చేపడుతమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గోగు శ్రీను దుర్గం సందీప్ సురేందర్ ప్రసాద్ జిమ్మిడి రాహుల్ డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *