గీత కార్మికుల పట్ల పాలకుల నిర్లక్ష్యం

# మోకుదెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్

నర్సంపేట,నేటిధాత్రి :

వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్ నల్లబెల్లికి చెందిన మేడగొని రమేష్ గౌడ్ అనే గీత కార్మికుడు తాటి చెట్టు ఎక్కి దిగుతుండగా ప్రమాదవషాత్తు కింద పడి తీవ్ర గాయాలపాలయ్యాడు. విషయం తెలుసుకున్న గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ తెలంగాణా స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ బుదవారం పరామర్శించారు. ఈ సందర్బంగా రమేష్ గౌడ్ మాట్లాడుతూ గీత కార్మికుల సంక్షేమం పట్ల పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కులస్థులలో 12 శాతం ఉన్న గౌడులను ఎన్నిక లప్పుడు ఓట్లేసే యంత్రాలుగా ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు.రాజు గౌడ్ కు ఎక్సయిస్ శాఖ,బీసీ కార్పొరేషన్ నుండి ఎక్స్ గ్రేషియా,హాస్పిటల్ ఖర్చుల కొరకు దరఖాస్తు చేయడం జరుగుతుందన్నారు. గత ఆరు నెలలుగా గాయపడిన, చనిపోయిన గీత కార్మికులకు పెండింగ్ ఎక్స్ గ్రేషియా, హాస్పిటల్ ఖర్చులు చెల్లించడం లేదన్నారు. ఇప్పటికైన తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం కల్లు గీత కార్పొరేషన్ కు చైర్మన్ ను నియమించాలని, కార్పొరేషన్ కు 500 కోట్లు నిధులు కేటాయించాలని రమేష్ గౌడ్ డిమాండ్ చేశారు. రాజు గౌడ్ ను పరా మర్శించిన వారిలో తిప్పని రవీందర్ గౌడ్, నేరెళ్ల రమేష్, గాజర్ల భద్రయ్య, పోలుదాసరి బిక్సపతి, గాజర్ల సారంగపాణి, గాజర్ల అశోక్ గౌడ్ తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!