పెరిగిన ఎన్డీఏ ఓట్ల శాతం
గ్రామీణ ప్రాంతాల్లోకి చొచ్చుకెళ్లిన బీజేపీ
ప్రత్యక్ష పోటీలో కాంగ్రెస్ అభ్యర్థులను ఓడిరచిన బీజేపీ నేతలు
ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మపై ప్రజల్లో సడలని విశ్వాసం
సంస్థాగత లోపాలతో కునారిల్లుతున్న కాంగ్రెస్
డెస్క్ ,నేటిధాత్రి:
అస్సాంలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ నేతృత్వంలోని ఎన్డీఏకూటమి అప్రతిహత విజయాన్ని నమోదు చేసింది. దీంతో రాష్ట్రంలో తన రాజకీయ ఆధిపత్యాని కి తిరుగులేదని నిరూపించింది. రాష్ట్రంలోని మొత్తం 376 జిల్లాపరిషత్ స్థానాల్లో 301 గెలుచు కున్న ఎన్డీఏ కూటమి తన ఆధిపత్యాన్ని నిరూపించింది. వీటిల్లో కూటమికి 76శాతం ఓట్లు లభించడం విశేషం. ఈ అప్రతిహత విజయం ప్రజల్లో ఎన్డీఏ ప్రభుత్వ పాలనపై పెరిగిన విశ్వాసానికి నిదర్శనంగా నిలిచింది. ఇక రాష్ట్రంలోని అంచలోక్ పంచాయతీ (ప్రాతినిధ్య పంచాయతీ ఎన్నికలు)ఎన్నిల్లో మొత్తం 2192 సీట్లలో 1445 సీట్లు సాధించి ఎన్డీఏ కూటమి తనకు తిరుగు లేదని నిరూపించింది. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో 66శాతం ఓట్లు సాధించడంతో తనకు గ్రామీణ ప్రాంతాల్లో కూడా తిరుగులేదన్న సత్యాన్ని వెల్లడిరచింది. 2018లో కూటమి సాధించిన ఓట్లకంటే ఇప్పుడు మరిన్ని ఓట్లు సంపాదించడం గమనార్హం. ఇదే సమయంలో గత ఎన్నికల్లో పోలయిన ఓట్లశాతంతో పోలిస్తే 25% వృద్ధి నమోదు చేయడం కూటమికి అస్సాంలో తిరుగులేద న్న సత్యం రుజువైంది. విచిత్రమేమంటే లోక్సభ ఎన్నికలు జరిగిన 2024 సంవత్సరానికి సరిగ్గా ఏడాది తర్వాత, 2026లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు ఈ ఎన్నికలు జరగ డం విశేషం. ఇక కాంగ్రెస్ పార్టీ జిల్లాపరిషత్ (జెడ్పీఎం)లో 72 స్థానాలు, అంచలోక్ పంచాయతీలో (ఏపీఎం)లో 481 స్థానాల్లో విజయం సాధించింది. అదేవిధంగా ఏఐయుడీఎఫ్ 8 జెడ్పీ ఎం స్థానాలను, ఏపీఎంలో 64 స్థానాలకు పరిమితమైంది. ఇక అఖిల్ గొగోయ్ నేతృత్వంలోని రాయ్జోర్ దళ్ మూడు జెడ్పీఎం మరియు 17 ఏపీఎం సీట్లను గెలుచుకుంది. అస్సాంలో పంచాయతీ ఎన్నికలు మే 2, 7 తేదీల్లో జరగ్గా 11వ తేదీన కౌంటింగ్ ప్రారంభమై 14వ తేదీన ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. అస్సాంలో మొత్తం 14 మిలియన్లమంది ఓటర్లుండగా 74శా తం ఓటింగ్ నమోదైంది.
అస్సాం పంచాయతీ చట్టరా1994 ప్రకారం రాష్ట్రంలో మూడంచెల పంచాయతీ వ్యవస్థ ఏర్పడిరది. అయితే 2023లో తీసుకొచ్చిన పంచాయతీరాజ్ సవరణ చట్టం అభ్యర్థులకు రాజకీయ గుర్తుల కేటాయింపునకు అనుమతించింది. అయితే గోవన్ పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థు లకు పార్టీ గుర్తులు కేటాయించలేదు. నిజానికి రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు 2023లోనే జరగాల్సి వుంది. శ్రీభూమి జిల్లాలో డీలిమిటేషన్ ప్రక్రియపై హైకోర్టు ఇచ్చిన తీర్పు, హయ్యర్ సెకండరీ పరీక్షలు ఫిబ్రవరి/మార్చిలో నిర్వహించాల్సి రావడంతో, ఈ ఎన్నికలను మే నెలలో నిర్వ హించారు.
ఈ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు ప్రధానంగా ఆసక్తి ప్రదర్శించిన నియోజకవర్గం జోర్హాట్. ఎందుకంటే 2024 లోక్సభ ఎన్నికల్లో జోర్హాట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ విజయం సాధించింది. హిందువులు అత్యధికంగా వుండే ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుపు విపక్షాల్లో ఆశలు పెంచింది. ముఖ్యంగా పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక శాతం సీట్లు సాధించవచ్చునని కాంగ్రెస్ ఎంతో నమ్మకంతో వుంది. కానీ పార్టీ ఆశలను వమ్ము చేస్తూ కేవలం మూడు అంచలోక్ సీట్లు మాత్రమే గెలుచుకోగా, బీజేపీ ఏకంగా 73 స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. గత లోక్సభ ఎన్నికల్లో సాధించిన విజయంతో గౌరవ్ గొగోయ్ (కాంగ్రెస్), అఖిల్ గొగోయ్ (రాజోరీదళ్), లూరింజ్యోతి గొగోయ్ (అస్సాం జాతీయ పరిషత్)లు ముగ్గురు ఏకమై ఈ సారి పంచాయతీ ఎ న్నికల్లో ప్రచారం నిర్వహించారు. విశేషమేంటంటే ఈ ముగ్గురిని పరిశీలకులు ‘‘ముగ్గురు గొగోయ్ల కూటమి’’ అంటూ వ్యవహరిస్తుంటారు. వీరిలో గౌరవ్ గొగోయ్ ప్రధాన స్రవంతికి చెందిన రాజకీయవేత్త కాగా, అఖిల్ గొగోయ్కి రైతు ఉద్యమాలు నిర్వహించినవాడిగా మంచి పేరుంది. ఇక లూరింజ్యోతి గొగోయ్ అస్సామీ మరియు అహోం భాషోద్యమాలు నిర్వహించిన చరిత్ర వుంది. నిజానికి జోర్హాట్ నియోజకవర్గంలో బీజేపీకి మంచి పట్టుండేది. కానీ గత లోక్సభ ఎన్నికల్లో అస్సామీ, అహోం హిందూ విద్యావంతుల్లో పెరిగిన వ్యతిరేకత బీజేపీ ఓటమికి కారణమైంది. అయితే ఈసారి పంచాయతీ ఎన్నికల్లో తిరిగి బీజేపీ పుంజుకోవడం విశేషం.
గ్రామీణ ప్రాంతాల్లో జరిగిన అంత్యలోక్ పంచాయతీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఓట్లశాతం, సీట్ల సంఖ్య గణనీయంగా పెరగడం గమనార్హం. 2018లో 55శాతం ఓట్లు సాధించిన ఎన్డీఏ, ఇప్పుడు ఏకంగా 75శాతం ఓట్లు సాధించింది. ఇదే కాంగ్రెస్కు గతంలో 35% ఓటు షేర్ వుండగా ఇప్పుడది 18%కు కుంచించుకుపోయింది. ఎగువ ఆస్సాం ప్రాంతంలో కూడా బీజేపీ తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. అయితే కేవలం ఎగువ అస్సాం మాత్రమే కాదు, మొత్తం అస్సాంలో కాంగ్రెస్తో ప్రత్యక్షంగా పోటీపడిన దాదాపు ప్రతిచోట బీజేపీ విజయం నమోదు చేసింది. అయితే బార్పేట, దరాంగ్, ధుబ్రి, హోజాయ్ నియోజకవర్గాల్లో మైనారీటీల ఓటర్లు అధికం. ఇక్కడ కాంగ్రెస్ గెలుపు సాధించింది.
మొత్తంమీద చెప్పాలంటే ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఓరునోదయ్’ నగదు బదిలీ పథకం, ప్రభుత్వానికి అనుకూల ఫలితాలనిచ్చిందనే చెప్పాలి. అదేవిధంగా రాష్ట్రంలో లక్ష ఉద్యోగాల కల్పన కోసం నిర్వహించిన డ్రైవ్ కూడా ప్రభుత్వం పట్ల సానుకూలతను పెంచింది. వీటితో పాటు కొన్ని సాంస్కృతిక అంశాలు కూడా అధికారంలో వున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి సానుకూల వాతావరణం ఏర్పడటానికి కారణమయ్యాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ‘రaుమోయ్ బినందిని’’ పండుగను తోటపనుల్లో పాల్గనే స్థానిక ప్రజలు ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ పండుగ నిర్వహణలో ప్రభుత్వం పాల్గనడం ద్వారా స్థానిక ప్రజల్లో ఉత్సాహాన్ని నింపింది. అంతేకాదు ముఖ్య మంత్రి హిమంత్ బిశ్వ శర్మ అవినీతికి వ్యతిరేకంగా చేపడుతున్న చర్యలు ప్రజలను ఆకట్టుకుం టున్నాయి.
ప్రస్తుతం జరిగిన ఈ ఎన్నికల్లో సాధించిన విజయం, అధికార ఎన్డీఏ కూటమిలో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ముఖ్యంగా 2026లో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం 104 స్థానాలున్న అసెంబ్లీలో మూడోసారి ముచ్చటగా అధికారంలోకి రావడానికి ఈ ఎన్నికలు మా ర్గం సుగమం చేశాయని కూటమి నేతల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో విపక్ష కాంగ్రెస్లో సంస్థాగత లోపాలు స్పష్టంగా కనిపించాయి. వీటిని సరిదిద్దుకొని సరైన నాయకుల నేతృత్వంలో పార్టీని మరింత సమర్థవంతంగా నడపకపోతే రాబోయే ఎన్నికల్లో గెలుపు మాట అట్లా వుంచి ఉనికి కూడా కష్టమయ్యే ప్రమాదం వుంది.