
చందుర్తి, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని ప్రతిభ విద్యాలయం పాఠశాల ఆవరణలో పాఠశాల కరస్పాండెంట్ కొడగంటి గంగాధర్ ఆధ్వర్యంలో గురువారం రోజున ముందస్తు మహిళా దినోత్సవం సందర్భంగా పాఠశాల టీచర్లను, ఆయమ్మ లను శాలువాతో సన్మానించారు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8 రోజున సెలవు దినం కాబట్టి ముందస్తుగా కార్యక్రమాన్ని నిర్వహించుకున్నామని స్త్రీలు భూమిలో సగం అని అంటారని వారికి అన్ని విభాగాలలో సమాన గౌరవం దక్కాలని కోరుకున్నారు, ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.