జాతీయ డెంగ్యూ దినోత్సవం.

National Dengue Day National Dengue Day

జాతీయ డెంగ్యూ దినోత్సవం

– డెంగ్యూ డే సందర్భంగా

– ప్రజల కు అవగాహన కల్పించేందుకు ర్యాలీ.

– దోమల వ్యాప్తిని అరికడుదాం.

డాక్టర్ గుగులోతు రవి

మరిపెడ నేటి ధాత్రి:

దోమల వ్యాప్తిని అరికట్టి డెంగ్యూ వ్యాధిని సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల వైద్యాధికారి డాక్టర్ గూగులోతు రవి పేర్కొన్నారు,డెంగ్యూ డే సందర్భంగా మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి మరిపెడ పట్టణం కార్గిల్ సెంటర్ మరియు బస్టాండ్ సర్కిల్‌ వరకు అవగాహన ర్యాలీ మరియు మానవహారం నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ రవి మాట్లాడుతూ ఆర్ధోవైరస్‌ తరగతికి చెందిన నాలుగు రకాల డెంగ్యూ వైరస్‌ల వల్ల ఈ వ్యాధి సోకుతుందన్నారు.ఇది మనిషి నుండి మనిషికి ఏడిస్‌ ఈజిప్టై దోమలద్వారా సంక్రమిస్తుందన్నారు.ఈ జాతి దోమ పైన నల్లని, తెల్లని చారలు ఉండుటవలన దీనిని టైగర్‌ దోమ అనికూడా పిలుస్తారన్నారు. ఈ దోమలు ఇంటిలోపల, ఆవరణలో ఉండి,పగటిపూట మాత్రమే కుడతాయన్నారు.ఇవి ఎక్కువ దూరం (400 మీటర్లు) ఎగరలేవని, అన్ని రకాల దోమలకంటే ఈ దోమ చాలా బరువైనదగా ఉంటుందన్నారు.డెంగ్యూ వైరస్‌ తో ప్రభావం అయిన దోమలోనే కాకుండా దోమ గుడ్లలో కూడా ఈ వైరస్‌ ఉంటుందన్నారు.కాబట్టి త్వరితగతిన ఎక్కువ మందికి వ్యాధి వ్యాపించే అవకాశం ఉంటుందన్నారు. ఈ దోమ మంచినీటి నిల్వలలో మాత్రమే గుడ్లు పెడుతుందని,ఈ వైరస్‌ వలన ఒకటి కంటే ఎక్కువసార్లు కూడా డెంగీ రావచ్చన్నారు,వ్యాధి లక్షణాలు ముఖ్యం గా
ఆకస్మికంగా తీవ్రమైన జ్వరం, తలనొప్పి,విపరీతమైన కండరాలు,కీళ్ళ నొప్పులు
కళ్ళు నొప్పులు, కంటి కదలిక తగ్గటం,నొప్పి,ఒక్కొక్కసారి శరీరంలో ఎర్రటి దద్దుర్లు ఏర్పడుతాయన్నారు
చిగుళ్ళ నుండి రక్తస్రావం
అధిక దాహం, నోరు ఎండిపోవడం వంటి లక్షణాలు ఉంటాయన్నారు.
డెంగీ వ్యాధి మూడు రకాలుగా బయటపడవచ్చు..
డెంగీ జ్వరం,డెంగీ హెమరేజ్‌ జ్వరం,డెంగీ షాక్‌ సిండ్రోమ్‌ గా వెల్లడి అవుతుందన్నారు.
నివారణ చర్యలు ముఖ్యం గా ఇంటిలోపల, ఇంటి ఆవరణలో ఎక్కడా మూతలేకుండా కొద్దిగా నీళ్ళుకూడా నిల్వ ఉండకూడదన్నారు
ఉదాహరణకు పూలకుండీల క్రింద, పెంకులు, కొబ్బరిబోండాలు, రుబ్బురోళ్ళు, పనికిరాని వస్తువులు, పాతటైర్లు, తాగి పడేసిన టీ కప్పులు, సీసాలు, , నీటి ట్యాంకులు, సంప్‌ లు, కూలర్లు, నీటి గుంటలుల్లో ఈ దోమ ఉత్పత్తి అవుతుందన్నారు.
దోమలు కుట్టకుండా దోమతెరలు వాడుకోవాలని వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు. ఈ కార్యక్రమం లో డాక్టర్ స్వామి, పబ్లిక్ హెల్త్ నర్సింగ్ ఆఫీసర్ మంగమ్మ, సూపెర్వైసోర్స్ కృష్ణ, ఆచార్యులు, సుదర్శన్, లక్ష్మి కుమారి, మాధవి, పల్లె దవాఖాన సిబ్బంది సాయి శ్రీ, సిరి, సతీష్, ఝాన్సీ, తరణి, హెల్త్ అసిస్టెంట్ వీరయ్య, నర్సయ్య, ఆశ ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!