మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
ప్రధాని నరేంద్ర మోడీ
శుక్రవారం రోజు నారాయణపేటకి రానున్నారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి.
డీకే అరుణమ్మ కు మద్దతుగా నారాయణపేటలో
నిర్వహించనున్న బహిరంగ సభలో ఆయన
ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించనున్నారు.
బహిరంగ సభకు 50 వేల మందిని
సమీకరించేందుకు పార్టీ నేతలు సన్నాహాలు
చేస్తున్నారు. లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని
ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి జనాన్ని
తరలించేందుకు ఆ పార్టీ వర్గాలు సన్నహాలు ముమ్మరం చేస్తున్నారు.