ప్రజల అభ్యున్నతికి ప్రజా ప్రభుత్వం పాటుపడుతుంది

– ఎమ్మెల్సీ ఎన్నికలు సెమీ ఫైనల్ రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఫైనల్

– బిఆర్ఎస్ బీజేపీ వ్యవహార శైలి గల్లీలో లొల్లి డిల్లీలో దోస్తీ

– పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి

సిరిసిల్ల(నేటి ధాత్రి):

రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోనీ కె కన్వెన్షన్ హాల్లో మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కేకే మహేందర్ రెడ్డి అధ్యక్షతన సిరిసిల్ల నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్,సిరిసిల్ల ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్, సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ,
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్ రెడ్డి భారీ మెజారిటీతో గెలిపించాలని అన్నారు.ఈ ఎన్నిక 42 అసెంబ్లీ నియోజకవర్గలలో జరుగుతున్న ఎన్నికని అన్నారు.గ్రామాల్లో ఉన్న పట్టభద్రులకు 50 మందికి ఒకరిని ఇంచార్జి గా పెట్టుకుని ఎన్నికల్లో ముందుకు పోవాలని అన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో డీఎస్సీ వేస్తే మళ్ళీ ప్రజా ప్రభుత్వంలో డీఎస్సీ వేయడం జరిగిందని అన్నారు.
బిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల లో ఇచ్చిన ఉద్యోగాలను మనం పది నెలల్లో ఇవ్వడం జరిగిందని అన్నారు.
గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని అన్నారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల మొదటి తేదీన జీతాలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు.
బిఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీలలో లేకుండా బీజేపీ తో ఒక లోపాయకారి ఒప్పందం చేసుకున్నారని అన్నారు.
ఆనాడు రాష్టప్రతి ఎన్నికల్లో, నల్ల చట్టాల అమలు సమయంలో బిఆర్ఎస్ బీజేపీ కి మద్దతు ఇచ్చారని అన్నారు.
బిఆర్ఎస్ బీజేపీ వ్యవహార శైలి గల్లీలో లొల్లి డిల్లీలో దోస్తీ అన్న విధంగా ఉందని అన్నారు.
మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి సున్నా సీట్లు రావడం జరిగిందని అన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికలు సెమీ ఫైనల్ రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఫైనల్ అన్నారు.
మీరు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలలో కష్టపడితే మీకు మీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉపయోగపడుతాయని అన్నారు.
మండలాల వారిగా గ్రామాల వారిగా ప్రతి ఒక్కరు కష్టపడాలని అన్నారు.
బూతుకు ఒక ఇంచార్జి పెట్టీ ఎన్నికలో ముందుకు పోవాలని అన్నారు.
ఎన్నికల రోజు బూతు ఇంచార్జిలు ఇతర ప్రాంతాల్లో ఉన్న పట్టభద్రులు వచ్చి ఓటు వేసేలా చూడాలని అన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికలతో ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉందని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు అందరికీ వివరించాలని అన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్ రెడ్డినీ భారీ మెజారిటీతో గెలిపించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహుమతిగా ఇవ్వాలని అన్నారు.
బిఆర్ఎస్ క్షేత్రస్థాయిలో బలహీన పడ్డది కాబట్టి నేడు పోటీలో లేదని అన్నారు.
బల్మూరి వెంకట్ ప్రతిపక్షంలో అనేక ఆందోళనలు చేసి ప్రజలను చైతన్యవంతం చేశారని అన్నారు.
గత ప్రభుత్వ హయాంలో సిరిసిల్ల నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులపై అనేక అక్రమ కేసులను పెట్టారని అన్నారు.
నేడు ప్రజా ప్రభుత్వంలో టిఆర్ఎస్ నాయకులపై ఒక్క కేసు కూడా నమోదు కాలేదని అన్నారు.
ఆనాడు కేటీఆర్ సిరిసిల్ల కి వస్తె నేరేళ్లలో ముళ్ళ కంచెలు వేసేవారని అన్నారు.
ప్రజా ప్రభుత్వంలో ప్రజలు స్వేచ్ఛగా వచ్చి తమ సమస్యలు చెప్పుకుంటున్నారని అన్నారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి ప్రజా ప్రభుత్వం పాటు పడుతుందని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!