
Narendra modi and indira gandhi
దేశానికి అత్యధిక కాలం పనిచేసిన రెండో ప్రధానిగా నరేంద్ర మోదీ..ఇందిరా గాంధీ రికార్డ్ బ్రేక్
భారత రాజకీయ చరిత్రలో ఈ శుక్రవారం (జూలై 25, 2025న) ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త రికార్డ్ సృష్టించారు. ఈ క్రమంలో మోదీ ఇప్పుడు దేశంలో అత్యధిక కాలం పాలన కొనసాగించిన రెండో ప్రధానమంత్రిగా నిలిచారు.
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఈ శుక్రవారం (జూలై 25, 2025) ఒక అరుదైన ఘనతను సాధించారు. ఆయన వరుసగా 4,078 రోజుల పాటు ప్రధానమంత్రిగా కొనసాగుతూ, ఇందిరా గాంధీ (1966-1977) రికార్డును అధిగమించి, దేశంలో ఎక్కువ కాలం పదవిలో ఉన్న రెండో ప్రధానమంత్రిగా నిలిచారు. ప్రస్తుతం దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ (1947-1964) మాత్రమే ఎక్కువకాలం పనిచేసిన ప్రధానుల్లో మొదటి స్థానంలో ఉన్నారు. నెహ్రూ 16 ఏళ్ల 286 రోజుల పాటు (1947-1964) పదవిలో కొనసాగిన రికార్డును కల్గి ఉన్నారు.
నరేంద్ర మోదీ 2014 మే 26న మొదటిసారి భారత ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి, ఆయన మూడోసారి ఈ పదవిలో కొనసాగుతున్నారు. 2024 జూన్లో మూడోసారి ప్రధానిగా ప్రమాణం చేసిన ఆయన, కాంగ్రెస్కు చెందని ప్రధానమంత్రిగా అత్యంత ఎక్కువ కాలం పదవిలో ఉన్న రికార్డును సొంతం చేసుకున్నారు. ఇందిరా గాంధీ 4,077 రోజుల పాటు (1966-1977) వరుసగా ప్రధానమంత్రిగా ఉండగా, మోదీ ఈ రికార్డును జూలై 25న అధిగమించారు.
గతంలో గుజరాత్
మోదీ రాజకీయ జీవితం గుజరాత్లో మొదలైంది. 2001 నుంచి 2014 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆ సమయంలో ఆయన గుజరాత్ను అభివృద్ధి పథంలో నడిపించారు. ఇది ఆయన జాతీయ రాజకీయ రంగంలోకి అడుగుపెట్టడానికి ఒక మంచి అవకాశంగా మారింది.
చారిత్రక విజయాలు
మోదీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 2014లో 272 లోక్సభ సీట్లతో ఘన విజయం సాధించింది. 2019లో ఈ సంఖ్య 303కు పెరిగింది, ఇది బీజేపీ బలాన్ని స్పష్టం చేసింది. 2024 ఎన్నికల్లో బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించలేకపోయినప్పటికీ, ఎన్డీఏ భాగస్వాముల సహకారంతో మూడో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో కాంగ్రెస్కు చెందని నాయకుడిగా, సొంతంగా లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ సాధించిన ఏకైక నాయకుడిగా మోదీ చరిత్ర సృష్టించారు.
నెహ్రూ తర్వాత
ఇందిరా గాంధీ (1971) తర్వాత మెజారిటీతో తిరిగి ఎన్నికైన తొలి ప్రధానమంత్రి మోదీ. అంతేకాక, జవహర్లాల్ నెహ్రూ తర్వాత మూడు వరుస ఎన్నికల్లో పార్టీ నాయకుడిగా విజయం సాధించిన ఏకైక ప్రధానమంత్రి కూడా మోదీనే. ఈ విజయాలు ఆయన రాజకీయ నైపుణ్యాన్ని, ప్రజలతో ఉన్న బలమైన సంబంధాన్ని స్పష్టం చేస్తున్నాయి.
ఆర్థిక సంస్కరణల నుంచి సామాజిక సంక్షేమ పథకాల వరకు, ఆయన పరిపాలన దేశ పురోగతికి ఒక స్పష్టమైన దిశను ఇచ్చింది. రాబోయే సంవత్సరాల్లో, ఆయన నాయకత్వం భారతదేశాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉంది.