నారాయణపేట / నేటి ధాత్రి.
నారాయణపేట జిల్లా (మం) పరిధిలోని పేరపల్ల అనుబంధ గ్రామపంచాయతీ పరిధిలోని మీది తండాకు చెందిన రవళికి సోమవారం పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు. ఇంటికి చేరుకున్న అంబులెన్స్ రవళిని ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలో రవళికి పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. కాసేపటికి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డలు క్షేమంగా ఉన్నారని ఈఏంటీ తాజుద్దీన్, రవికుమార్ తెలిపారు.