బొల్లారం లోని కల్లుగీత కార్మికులకు సభ్యత్వం ఇవ్వాలి నరసింహ గౌడ్

పఠాన్ చేరు , నేతిధాత్రి
పటాన్‌చెరు నియోజకవర్గం బొల్లారంలోని కల్లు సొసైటీ లో సభ్యత్వం కోసం 30 ఏళ్లుగా అడుగుతున్నా నాన్ లోకల్ కాంట్రాక్టర్ మూసాపేట శ్రీశైలం గౌడ్ బొల్లారంలో ఏళ్ల తరబడి ఉంటున్న గీతా కార్మికులపై పెత్తనం చలాయించడంపై కౌండిన్య గీత అసోసియేషన్ మెంబర్స్ బొల్లారం అధ్యక్షుడు నర్సింహా గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్లు సొసైటీలో సభ్యత్వం ఇప్పించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినా శ్రీశైలం గౌడ్ ఇవ్వనీయకుండా అడ్డుకుంటున్నారన్నారు. మంత్రి, ఎమ్మెల్యే అధికారులకు ఆదేశించినా అధికారులు స్పందించకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. అధికారులు సైతం కాంట్రాక్టర్ చెప్పు చేతల్లో ఉంటూ చేతులెత్తేస్తున్నారని వాపోయారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తమకు న్యాయం చేయాలని కోరారు. చేసేదేమి లేక కొత్తగా అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నామని, అధికారులు స్పందించి లైసెన్స్ ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో రమేష్ గౌడ్, రాంచందర్ గౌడ్, చరణ్ గౌడ్, రాజు గౌడ్, కిరణ్ గౌడ్, అరవింద్ గౌడ్, నర్సన్ గౌడ్ ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!