*వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు *
ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు
బెజగం నాగరాజు మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
జగత్ జనని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి వైశాఖ శుద్ధ దశమి మే 7న బుధవారం మొగుళ్ళపల్లి మండలకేంద్రంలోని శ్రీ శ్రీ శ్రీ సాంబమూర్తి దేవాలయంలో ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు
. ఆర్యవైశ్యుల కులదేవత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలను ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు బెజగం నాగరాజు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి పురోహితులు భైరవపట్ల వెంకటేశ్వర్ల శర్మ పూజా ప్రాంగణాన్ని సం ప్రోక్షణ చేసి సకల దేవతలను ఆహ్వానం చేయించిన అనంతరం వాసవి మాతకు ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహించారు అనంతరం మహా అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు

ఆర్యవైశ్య బంధుమిత్రులందరు ప్రజలందరికీ సుఖ సంతోషాలతో ఉండాలని ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు బెజగం నాగరాజు ఉపాధ్యక్షులు బజ్జురి వీరన్న కోశాధికారి వేణుగోపాల్ యూత్ అధ్యక్షులు పుల్లూరి సాయికృష్ణ కోశాధికారి గోలి మహేష్ ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి మంజుశ్రీ ఆర్యవైశ్య సంఘ కుటుంబ సభ్యులు కోరుకున్నారు .