డాక్టరేట్ సాధించిన నాగూర్ల సంజీవ్

దేశరాజుపల్లి గ్రామస్థుల అభినందనలు

నేటిధాత్రి కమలాపూర్(హన్మకొండ)హన్మకొండ జిల్లా కమలా పూర్ మండలం దేశరాజు పల్లి గ్రామానికి చెందిన నాగుర్ల సంజీవ్ కామర్స్ విభాగం లో పిహెడ్ పూర్తి చేసి డాక్టరేట్ పట్టా సాధించాడు.కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ తాటి కొండ రమేష్ సంజీవ్ కు డాక్టరేట్ ప్రధానం చేశారు.గ్రామీణ ప్రాంతంలో ఒక బీద కుటుంబంలో జన్మించి,గత 25 సంవత్సరాల పాటు ప్రైవేటు అధ్యాపకుడిగా వుంటూ పీహెచ్డీ పూర్తి చేసి డాక్టరేట్ పట్టా సాధించడం పట్ల గ్రామస్తులు,కుటుంబ సభ్యులు సంజీవ్ ను అభినందించి,హర్షం వ్యక్తం చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *