
N. Dilip Rao Appointed RTI Telangana State General Secretary
ఆర్టీఐ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్.దిలీప్ రావ్
పరకాల నేటిధాత్రి
సమాచార హక్కు చట్టం సాధన కమిటీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్.దిలీప్ రావ్ నియమితులయ్యారు.ఈ మేరకు మంగళవారం ఆ కమిటీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు డాక్టర్.చంటి ముదిరాజ్,రాష్ట్ర అధ్యక్షురాలు సూర స్రవంతి, జాతీయ ప్రధాన కార్యదర్శి మల్లం వెంకటేశం,ఎన్.దిలీప్ రావ్ కు నియామకపత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా దిలీప్ రావ్ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి బయటకు తీస్తూ సమాచార హక్కు చట్టం గురించిపౌరులకు,విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడానికి కృషి చేస్తానన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు గోపీనాథ్ కట్టెకోల,వేముల పుష్పాలత, రాష్ట్ర కార్యదర్శి గండు వెంకటేశ్వర్లు,రాష్ట్ర సంయుక్త నీలం వెంకట మధు,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రశేఖర్,అరుణ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు