మాటలతో మభ్యపెత్తే నాయకుడు కాదు మైనంపల్లి: మాజీ బీఆర్ఎస్ నాయకుడు శ్రీ రామ్ యాదవ్

ప్రజా సమస్యలు పరిష్కారమే తన మొదటి ఎజెండా..
కొంతమంది నాయకుల వల్ల కాలనీలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు: జంగాల శ్రీరామ్ యాదవ్
నమ్ముతే కార్యకర్తలకు ప్రాణాలైనా ఇస్తాడు..కాంగ్రెస్ పార్టీ నాయకులు

మల్కాజిగిరి
17 అక్టోబర్

అన్నా అంటే నేనున్నానని పలికే గొప్ప నాయకుడు ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అని బిఆర్ఎస్ పార్టీ మాజీ నాయకుడు శ్రీరామ్ యాదవ్ అన్నారు.మంగళవారం జంగాల శ్రీరాం యాదవ్ ఆధ్వర్యంలో మల్కాజ్గిరి నియోజకవర్గం గౌతమ్ నగర్ 141 డివిజన్ పరిధిలోని మిర్జాల్ గుడ, లోని మైనంపల్లి హనుమంతరావు తో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.కార్యక్రమానికి ఎమ్మెల్యే మైనంపల్లి హాజరయ్యారు. ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సమక్షంలో సుమారు 100 మంది బిఆర్ఎస్ పార్టీని విడి కాంగ్రెస్ లో చేరడం జరిగింది.ఈ సందర్భంగా కాలనీ వాసులతో కలిసి జంగాల శ్రీరామ్ యాదవ్ తమ కాలనీలో ఉన్న సమస్యలను ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కు వివరించారు.చిన్న పాటి వర్షం పడ్డ కాలనీలో కొంతమంది చేసిన తప్పిదం వల్ల కాలనీ మొత్తం జలమయమై కాలనీవాసులు రోగాల బారిన పడుతున్నారని, వర్షం పడ్డప్పుడల్లా నీటి వరదలో పిల్లలు పడుతున్నారని వాహనాలు కొట్టుకుపోతున్నాయని వాపోయారు. 60 అడుగులు ఉండవలసిన రోడ్లు కుదించడంతో కాలనీవాసులు ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు.ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ కాలనీలో ఉన్న సమస్యలన్నిటిని పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది.కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 పథకాలు అద్భుతంగా ఉన్నాయని, రాబోయే ఎలక్షన్స్ లో అందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో సత్యనారాయణ రెడ్డి,పెరుమాళ్,డానియల్,విజయ్ కుమార్,సుధాకర్,రమేష,నర్రి యాదవ్,పెంటైః,మోహిత్ కుమార్ యాదవ్,శోబా రాణి,మంగమ్మ లతోపాటు మూడు కాలనీలకు చెందిన కాలనీవాసులు కాలనీ అసోసియేషన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!