విధి నిర్వహణలో ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలి.

Panchayat Officer D. Venkateswara Rao Panchayat Officer D. Venkateswara Rao

విధి నిర్వహణలో ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలి

జిల్లా పంచాయతీ అధికారి డి.వెంకటేశ్వరరావు

జైపూర్,నేటి ధాత్రి:

 

 

 

మంచిర్యాల జిల్లా పంచాయతీ అధికారి జైపూర్ మండలంలోని ఇందారం,టేకుమట్ల, కిష్టాపూర్,వేలాల గ్రామపంచాయతీలను ఆకస్మికంగా సందర్శించడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్లాస్టిక్ ఎక్కడ ఉండకూడదని,క్రమం తప్పకుండా డ్రై వేస్ట్ కలెక్షన్ చేయాలని,డ్రైనేజీలలో పూర్తిస్థాయిలో మట్టి తీయాలని,క్రమం తప్పకుండా రికార్డులను అప్డేట్ చేయాలని, ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉంటుంది. గనుక ముందస్తుగా గ్రామంలో తాగునీటి సమస్యలు రాకుండా చూడాలని,అదేవిధంగా నీటిని పంపిణీ చేసే ప్రతిసారి బ్లీచింగ్ పౌడర్ కలపాలని,క్రమం తప్పకుండా నీటిని పరీక్షించాలని,వేస్ట్ కలెక్షన్ రిజిస్టర్,కంపోస్ట్ కంజుమ్షన్ రిజిస్టర్ నిర్వహించాలని,క్యాష్ ఇన్ హ్యాండ్ త్వరగా గ్రామపంచాయతీ సాధారణ నిధికి జమ చేయాలని,విధి నిర్వహణలో ప్రతిక్షణం చాలా అప్రమత్తంగా ఉండాలని లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.గురువారం రాత్రి సంభవించిన గాలి దుమారానికి ఎగిరిపోయిన నర్సరీ షేడ్ నెట్ ను సరిచేయాలని,చలివేంద్రంలో వాటర్ క్రమం తప్పకుండా నింపాలని పంచాయతీ కార్యదర్శులకు ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి డి. వెంకటేశ్వరరావు,ఎంపీఓ శ్రీపతి బాపు రావు,పంచాయితీ కార్యదర్శులు ఏ.సుమన్,ఆర్. శ్రావణి,ఎల్.ప్రశాంత్,రాకేష్ గ్రామపంచాయతీల పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!