భద్రాద్రి లో కర్ణాటక సంగీత కళాకారుల సంగీత స్వరార్చన

భద్రాచలం నేటి దాత్రి

ఈ రోజు ట్రూ టాలెంట్ సింగెర్స్ గ్రూప్ మరియు భద్రాద్రి మెలోడి సింగెర్స వారి ఆధ్వర్యంలో కర్నాటక శాస్త్రీయ సంగీతం పోటీలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కన్వీనర్ బెల్లంకొండ దుర్గా కోమలి మరియు జే అర్ మూర్తి తెలియచేశారు. ఈ నెల 21.4.24 న అహోబిల నారసింహ మఠం భద్రాచలం వేదికగా ఈ కార్యక్రమం నిర్వహించబడును. విజేతలకు పారితోషకం మెమెంటో ధృవ పత్ర o అంద చేయ బడును. కార్యక్రమ న కు సంభదించన ఆహ్వాన పత్రం ను ఈరోజు చీఫ్ గెస్ట్ శ్రీమతి ఎల్ రమాదేవి కార్య నిర్వహణ అధికారి రామాలయం , ముఖ్య అతిథులుగా శ్రీ పి. దుర్గా ప్రసాద్ సంఘ సేవకులు, పర్యావరణ వేత్త లయన్ dr. గోళ్ళ భూపతి రావు, గౌరవ అద్యక్షులు గ్రీన్ భద్రాద్రి , నిర్వాహకులు ప్రోగ్రామ్ కన్వీనర్ బెల్లంకొండ దుర్గ కోమలి , జె ఆర్. మూర్తి విడుదల చేశారు. ఈ స్వర అర్చన కార్యక్రమానికి భద్రాద్రి లో ఉండే కళాభిమనులు సంగీత కళాకారులు పుర ప్రముఖులు హాజరై విక్షీoచ వలసినదిగా కోరడమైనది. ఈ సందర్భంగా శ్రీమతి దుర్గ కోమలి మాట్లాడుతూ భద్రాద్రి వాసులకు కర్నాటక శాస్త్రీయ సంగీత కళాకారులను వారి ప్రతిభ ను ప్రదర్శించే అవకాశం కల్పించడం నాకు ఎంతో సంతోషంగా ఉందని తెలియ చేశారు. కళాకారులకు భోజన వసతి కూడా ఏర్పాటు చేయ దమైనది. ఇట్లు. బెల్లంకొండ దుర్గ కోమలి, కన్వీనర్, jr మూర్తి. కో కన్వీనర్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!