
Munja Mahesh elected
శ్రీరామ్ యూత్ అధ్యక్షునిగా ముంజ మహేష్ ఎన్నిక
నేటి ధాత్రి కథలాపూర్
కథలాపూర్ మండలం లోని సిరికొండ శ్రీరాం యూత్ అధ్యక్షునిగా ముంజ మహేష్ వీరేంద్ర ను మంగళవారం రోజున నియమించినట్లు యూత్ సభ్యులు తెలిపారు. ఉపాధ్యక్షులు నునుగొండ పునీత్, ప్రధాన కార్యదర్శి బెజ్జారపు నితిన్, కోశాధికారిగా మర్రిపెల్లి వంశీ లు ఎన్నికయ్యారు. తన నియామకానికి సహకారాన్ని అందించిన సభ్యులకు వీరేంద్ర కృతజ్ఞతలు తెలియజేశారు. యూత్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు చేపడతామని అన్నారు.. ముందస్తుగా అందరికీ వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నీలి శ్రీనివాస్, ఓలవేని శ్రీనివాస్,నీలి కన్నయ్య, సిరిమల్లె రాజశేఖర్,మల్యాల మారుతి,గాంధారి శ్రీనివాస్ మహేష్ వీరేంద్ర ను అభినందించారు.