మున్సిపల్ ఎన్నికలు సక్సెస్: అధికారుల సంబరాలు
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గంలో రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికలు పారదర్శకంగా, సజావుగా ముగిశాయి. ఈ విజయంతో మున్సిపల్ కమిషనర్ జైతురాం నాయక్, ఎమ్మార్వో దశరథ్ సిబ్బందితో కలిసి ఆనందోత్సాహాలతో ఫోటోలు దిగారు. విధులను సమర్థవంతంగా నిర్వహించిన సిబ్బందిని అధికారులు అభినందించారు. అందరి సమిష్టి కృషితోనే ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని వారు పేర్కొన్నారు.ఈ ఎన్నికలు 2026 ఫిబ్రవరి 17న సాయంత్రం దాకా జరిగాయి.
