Mock Drill Awareness Program Held
ఆఫ్-సైట్ మాక్ డ్రిల్ అవగాహన సదస్సులో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట పట్టణంలో మెగా గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ టీఎం అవినాష్, ఓఎం టీమ్ రాజేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆఫ్ సైట్ మాకు డ్రిల్ అవగాహన సదస్సులో ముఖ్యఅతిథిగా నర్సంపేట మున్సిపాలిటీ చైర్ పర్సన్ శ్రీమతి పెండెం శ్రీలక్ష్మీరామానంద్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్ మాట్లాడుతూ
మెగా గ్యాస్ వినియోగం పట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా పరిశ్రమల్లో కర్మాగారంలో పల లేదా గృహ నివాసంలో గ్యాస్ లీకేజీ లాంటి ప్రమాదం లేదా భారీ అగ్నిమాపక ప్రమాదం జరిగినప్పుడు ప్రజలు సమస్యను ఎదుర్కొని ఎలా సురక్షితంగా బయటపడాల్లో ఒక అవగాహన వస్తుందని అన్నారు. ప్రాణ, ఆస్తి నష్టాన్ని కనిష్ట స్థాయికి తగ్గించేందుకు ఇలాంటి మాక్ డ్రిల్స్ ఎంతో ఉపయోగపడతాయని అని అన్నారు. పోలీస్, ఫైర్ సర్వీస్, వైద్య బృందాలు, మరియు రెవెన్యూ శాఖల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడానికి తోడ్పడుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కాటం భాస్కర్,టౌన్ ఎస్సై గూడ అరుణ్ , మున్సిపల్ కౌన్సిలర్లు ఎలకంటి విజయ్ కుమార్, మాదాసి రవి , పొన్నాల మనీషా-ప్రకాష్ , ములుకల వినోద-సాంబయ్య , కొంపల్లి వీణ-విజేందర్ రెడ్డి, వేల్పుల శ్రీలత,ఇస్లావత్ రామ-గోపి నాయక్ , తదితరులు పాల్గొన్నారు.
