Chairman Meets Sanitation Workers
పారిశుద్య కార్మికులతో మున్సిపల్ చైర్మన్ సమావేశం
విధులతో పాటు ఆరోగ్యం కూడా ముఖ్యమే
పరకాల,నేటిధాత్రి
పురపాలక సంఘం పరిధిలోని పాత మునిసిపల్ కార్యాలయంలో పారిశుద్య కార్మికులతో మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్ సమావేశమయ్యారు. పట్టణంలోని కూరగాయల మార్కెట్,మెయిన్ రోడ్, ప్రభుత్వ ఆసుపత్రి రోడ్లలో శుభ్రత పనులు నిర్వహిస్తున్న సిబ్బందితో ఆయన సమీక్ష జరిపారు.ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ప్రతి కార్మికుడు తనకు కేటాయించిన వార్డులో విధులను సమయానికి పూర్తి చేయాలని సూచించారు.ప్రజలు,కౌన్సిలర్లతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని చెప్పారు.ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని పనివేళల్లో తగినంత నీరు, నిమ్మరసం తీసుకోవాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు.కుటుంబ బాధ్యతలను గుర్తుంచుకుని జాగ్రత్తగా ఉండాలని సూచించారు.పనుల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వెంటనే తెలియజేయాలని కార్మికులను కోరారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అంజయ్య,15వ వార్డు కౌన్సిలర్ కుక్కల విజయ్,సానిటరీ ఇన్స్పెక్టర్ జి.వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
