ఏజెన్సీలో యాదేచ్చగా బహుళ అంతస్థుల నిర్మాణాలు.

ఏజెన్సీ చట్టాలు అమలు చేయని అధికారులు.

ఏజెన్సీలో బహుళ అంతస్థుల నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నది ఎవరు.??

ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలి.-జేఏసీ ప్రధాన కార్యదర్శి కలం సాంబమూర్తి.

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటి ధాత్రి..

పూర్తిగా ఏజెన్సీ ప్రాంతమైన కరకగూడెం మండల కేంద్రంలో ఏజెన్సీ చట్టలకు విరుద్దంగా గిరిజనేతరులు భూ క్రయ విక్రయలు జరుపుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు సాగిస్తున్న గిరిజనేతరులు.ప్రభుత్వ అధికారులు మాత్రం నిమ్మకు నీరేఎత్తినట్టు చూస్తున్న అధికారులు. ఏజెన్సీ చట్టాలు 1/59, 1/70 యాక్ట్,ఎల్ టీ ఆర్ చట్టాల ప్రకారం ఏజెన్సీ ప్రాంతంలో బహుళ అంతస్తుల నిర్మాణాలు పూర్తిగా నిర్ములించాలి కానీ అవి ఏమి పట్టనట్టు చూస్తున్న అధికారులు. ఎటువంటి అనుమతులు లేకుండానే బహుళ అంతస్థుల నిర్మాణాలు జరిగిపోతున్నాయి. ఏజెన్సీ చట్టాలను పకడ్బందీగా అమలు చేయాల్సిన అధికారులే గిరిజనేతరులకు కొమ్ముకాస్తు చేతులెతేసి చోద్యం చూస్తున్న అధికారులు. ఇదంతా చూస్తుంటే ఏజెన్సీ ప్రాంతంలో ఇక్కడ గిరిజనేతరులకు ఏజెన్సీ చట్టాలు వర్తిస్తాయా, అనే భావన కలుగుతుంది, ఇది ఇలానే జరిగితే ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసుల మనగడ ప్రశ్నర్దాకంగా మారుతుందని ఆదివాసి సంఘాల ఐక్యవేదిక (జేఏసీ) కరకగూడెం మండల ప్రధాన కార్యదర్శి కలం సాంబమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు.మండల పరిధిలో చాలామంది నిరుపేద ఆదివాసీ కుంటుంబాలు ఇల్లు కట్టుకొని ఉండటానికి ఇంటి స్థలాలు లేకపోవడంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆదివాసీ కుటుంబాలకు ప్రభుత్వ స్థలాలు కేటాయించి వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి వారిని ఆర్థికంగా ఆదుకోవాలని ఈ సందర్బంగా ఆదివాసీ సంఘాల ఐక్యవేదిక(జేఏసీ) కరకగూడెం మండల కమిటీ డిమాండ్ చేస్తుంది.

ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలి-జేఏసీ కో-కన్వీనర్ వజ్జ నరసింహారావు.

మండలలోని సమత్ భట్టుపల్లి రెవిన్యూ పరిధిలో 770 సర్వే నెం. లో సుమారు 500 ఎకరాలు పైచిలుకు భూములు ఉన్నాయి, అందులో సుమారుగా 300 ఎకరాల వరకు అన్యాక్రాంతం అయ్యాయని ఆరోపించారు. గిరిజనేతరుల ఆధీనంలో ఉన్నటువంటి భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఆ భూములు ప్రభుత్వ అధీనంలో ఉన్నట్టుగా ప్రభుత్వ సూచికలను ఏర్పాటు చేయాలనీ, అలాగే భట్టుపల్లి రెవిన్యూ లో గల సర్వే నెం.9 లో 1 ఎకరం 03 కుంటల ప్రభుత్వ భూమిని ఆదివాసీ సంఘాల ఐక్యవేదిక (జేఏసీ) కరకగూడెం కి అప్పగించి ఏజెన్సీలో ఆదివాసీ చట్టాలు పకడ్బందీగా అమలు చేయాలనీ డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!