ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా జరపాలి
ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా నిలిచిన అన్ని కులాలకు కృతజ్ఞతలు తెలుపుతాం- ఎమ్మార్పీఎస్ జిల్లా ఇంచార్జి మంద రాజు మాదిగ
కరీంనగర్, నేటిధాత్రి:
జూలై 7న ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను గ్రామ గ్రామాన పెద్ద ఎత్తున నిర్వహించాలని , దండోరా జెండాను ఆవిష్కరించి అన్ని కులాల పెద్దలను సత్కరించాలని ఎమ్మార్పీఎస్ జిల్లా ఇంచార్జి మంద రాజు మాదిగ, జిల్లా అధ్యక్షులు బెజ్జంకి అనిల్ మాదిగ పిలుపునిచ్చారు.
కరీంనగర్ జిల్లా రామడుగు మండల స్థాయి ఎమ్మార్పీఎస్ కార్యకర్తల సదస్సు కొత్తూరి రాజన్న మాదిగ అధ్యక్షతన జరిగింది.
ఈకార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా ఎమ్మార్పీఎస్ జిల్లా ఇంచార్జి మంద రాజు మాదిగ, జిల్లా అధ్యక్షులు బెజ్జంకి అనిల్ మాదిగలు పాల్గొని మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం మంద కృష్ణ మాదిగ నేతృత్వంలో మూడు దశాబ్దాలుగా రాజీలేని పోరాటం చేసి విజయం సాధించడం జరిగింది.
ఈపోరాటానికి అన్ని కులాలు మద్దతు ఇవ్వడం జరిగిందని అన్నారు.
ఎమ్మార్పీఎస్ ఉద్యమానికి శ్రేయోభిలాషులుగా సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ సత్కరించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు..
ఎమ్మార్పీఎస్ ఉద్యమం మాదిగల కోసమే ప్రారంభించినా అన్ని వర్గాల సంక్షేమం కోసం పోరాడిందని అన్నారు.
గుండె జబ్బుల చిన్నారుల ఉచిత ఆపరేషన్ల కోసం, ఆరోగ్యశ్రీ పథకం కోసం, వికలాంగులు వృద్దులు వితంతువుల పెన్షన్ల కోసం ఎస్సీ,ఎస్టీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్ల కోసం తెలంగాణ అమరుల కుటుంబాల సంక్షేమం కోసం, మహిళలపై అత్యాచారాలను అరికట్టడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని పాలకుల మీద పోరాడి విజయం సాధించిందని అన్నారు.
ఈఫలితాలు సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు అనుభవిస్తున్నారని అన్నారు.
సుదీర్ఘ కాలం ప్రజల్లో ఉండి అన్ని వర్గాలకు ఉద్యమం ద్వారా సేవ చేసినందుకే మంద కృష్ణ మాదిగకి పద్మశ్రీ పురస్కారం దక్కిందని అన్నారు.
ఈఅవార్డు మాదిగ జాతికి దక్కిన గౌరవమని అన్నారు.
ఎస్సీ వర్గీకరణ సాధించిన నేపథ్యంలో సమాజంలోని అన్ని వర్గాల ప్రయోజనాల దృష్ఠిలో పెట్టుకొని భవిష్యత్తూలో ముందుకు సాగుతామని అన్నారు.
జూలై 7న ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి గ్రామంలో దండోరా జెండాను ఆవిష్కరించాలని అన్నారు.
ప్రతి గ్రామంలో సభలు నిర్వహించి పెద్ద ఎత్తున వేడుకలు చేయాలని పిలుపునిచ్చారు.
ఈకార్యక్రమంలో కొత్తూరి రాజన్న మాదిగ, తడగొండ శంకర్ మాదిగ, శనిగరపు హన్మయ్య మాదిగ, దోమకొండ శ్రీనివాస్ మాదిగ, గంగాధర రవి మాదిగ, జెట్టిపెల్లి అనిల్ మాదిగ, గజ్జెల స్వామి మాదిగ, లంక నర్సింగం మాదిగ, తడగొండ రమేష్ మాదిగ, కనకం అంజయ్య మాదిగ, తడగొండ రాజు మాదిగ, కొత్తూరి బాబు మాదిగ, భూత్కూరి అంజయ్య మాదిగ, గుడిసె విజయ్ మాదిగ, రేణికుంట బాపు రాజు మాదిగ, తదితరులు పాల్గొన్నారు.