
Jyoti Pandal
ఎమ్మార్పీఎస్ మరియు తీన్మార్ మల్లన్న టీం సభ్యుల నీ సన్మానించిన జ్యోతి పండాల్.
జహీరాబాద్ నేటి ధాత్రి:
జ్యోతి పండాల్ తన నివాసంలో ఎమ్మార్పీఎస్ మరియు తీన్మార్ మల్లన్న టీం సభ్యులని సన్మానించడం జరిగింది. 30 సంవత్సరాల నుండి అలుపెరుగని పోరాటం చేసి ఏ బి సి డి ఎస్సీ వర్గీకరణ సాధించిన మందకృష్ణ మాదిగ గారికి అండగా ఉండి వారికి సహాయం అందించి, అలాగే మొన్న మందకృష్ణ మాదిగ గారి జన్మదిన వేడుకను జరుపుకున్న సందర్భంగా పార్టీలకి అతీతంగా అందరి నాయకులను పిలిచి సన్మానించి వారి మంచి మనసుని చాటుకున్నారు, వారి మంచి మనసుని అభినందిస్తూ మన జహీరాబాద్ నియోజకవర్గం ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులని మరియు ఇన్చార్జిలందరినీ కూడా సన్మానించడం జరిగింది. అలాగే మొన్న జరిగిన తీన్మార్ మల్లన్న బీసీ మీటింగ్ కి చాలా కృషి చేసి ఆ మీటింగ్ని చాలా విజయవంతం చేసినందుకు గాను తీన్మార్ మల్లన్న టీం సభ్యులకి కూడా సన్మానం జరిగింది. ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టుగా ఒక చిన్న గ్రామంలో ఒక్క మీటింగ్ తో రెండు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించి మన జహీరాబాద్ పేరుని ఎక్కడికో తీసుకెళ్లిన పవర్ ఫుల్ టీం కి జ్యోతి పండాల్ అభినందించి సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జ్యోతి పండాల్, తీన్మార్ మల్లన్న టీం జహీరాబాద్ ఇన్చార్జి నరసింహ, శ్రీకాంత్, హనుమంతు, రాకేష్, ఉల్లాస్ మాదిగ జహీరాబాద్ ఎమ్మార్పీఎస్ ఇంచార్జ్, జయరాజ్ మాదిగ ఎమ్మార్పీఎస్ సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు, నిర్మల్ కుమార్ మాదిగ మొగుడంపల్లి ఎమ్మార్పీఎస్ ఇంచార్జ్, టింకు మాదిగ జహీరాబాద్ మండల ఇన్చార్జ్ ఎమ్మార్పీఎస్, సుకుమార్ మాదిగ ఎమ్మార్పీఎస్ కార్యదర్శి జహీరాబాద్, జీవన్ మాదిగ ఎమ్మార్పీఎస్, రాఘవులు, సాయికుమార్ మరియు తదితరులు పాల్గొన్నారు.