గణపురం నేటి ధాత్రి
గణపురం మండలంలో ఎమ్మార్వో కార్యాలయం లో నలుగురికి 14 వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని, గణపురం మండలమునకు సంబంధించి ఉత్తమ బి ఎల్ ఓ అవార్డు గా మైలారం గ్రామానికి చెందిన రంజిత్ (కారోబార్) గణపురం గ్రామానికి చెందిన O. మౌనిక (ఆశ వర్కర్) ఉత్తమ కంప్యూటర్ ఆపరేటర్ గా పేర్ల హరీష్ కుమార్ మరియు ఉత్తమ బి ఎల్ ఓ సూపర్ వైజర్ గా ఏ ఆర్ ఐ మమ్మద్ రహమత్ పాషా లకు అడిషనల్ కలెక్టర్, అసిస్టెంట్ కలెక్టర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మరియు రెవెన్యూ డివిజనల్ అధికారి, చేతుల మీదుగా ప్రశంస పత్రాలను జయశంకర్ భూపాలపల్లి జిల్లా కార్యాలయము లో అవార్డులను పంపిణి చేయడం జరిగినది. వీరిని ఎమ్మార్వో మురళీధర్ రావు అభినందనలు తెలియజేయడం జరిగింది