ఘనంగా ఎంపీటీసీల పదవీ విరమణ సన్మాన కార్యక్రమం

జైపూర్,నేటి ధాత్రి :

జైపూర్ మండల కేంద్రంలోని రైతు వేదిక కార్యాలయంలో బుధవారం రోజున గత స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలంలోని అన్ని ప్రాదేశిక నియోజక వర్గం లలో ఎంపీటీసీలుగా, ఎంపీపీగా, జడ్పిటిసిగా, గెలిచిన సభ్యుల ఐదు సంవత్సరాల పదవి కాలం నేటితో పూర్తి కావడంతో వారికి పదవి విరమణ వీడ్కోలు కార్యక్రమం జైపూర్ ఎంపీడీవో సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీ పాలనలో మీ పరిధిలోని గ్రామాలు చాలా అభివృద్ధి చెందినావాని అన్నారు. అందరు కూడా అవకాశం ఉంటే పదవి ఉన్నా లేకున్నా మీ మీ గ్రామాల అభివృద్ధిలో మీ ప్రజల అభివృద్ధిలో నిరంతరం కృషి చేయాలని తెలియజేశారు. అలాగే జెడ్పిటిసి మేడి సునీత, ఎంపీపీ గొదరి రమాదేవి, ఎంపీటీసీలు అందరూ గడిచిన ఐదు సంవత్సరాలలో తాము చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వారు అనుభవించిన కష్ట నష్టాలను చెప్పుకున్నారు. ఈ కార్యక్రమం అనంతరం ఆయా గ్రామాల ప్రజలు నాయకులు ఆయా గ్రామాల ఎంపీటీసీలను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సత్యనారాయణ వివిధ గ్రామ పంచాయతీల కార్యదర్శులు మండల అభివృద్ధి కార్యాలయ సిబ్బంది,కాంగ్రెస్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఫయాజుద్దీన్, జిల్లా ప్రధాన కార్యదర్శి రిక్కుల శ్రీనివాస రెడ్డి ,నాయకులు లక్ష్మణ్,సురేందర్ రెడ్డి, సమ్మయ్య,రవి తిరుపతి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!