జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని గంగిపల్లి మరియు రామారావు పేట గ్రామాలలో శుక్రవారం రోజున ఎంపిడివో సత్యనారాయణ గౌడ్ పర్యటించారు. ఇరు గ్రామాల్లో జరుగుతున్నటువంటి ఉపాధి హామీ పనులను పర్యవేక్షించి, నిర్దేశించిన కొలతల్లోనే పని పూర్తి చేయాలని, అందరూ ఒక జట్టుగా సమన్వయంతో ఇలాంటి ప్రమాదకర సంఘటనలు జరగకుండా జాగ్రత్తగా పని చేసుకోవాలని సూచించారు. అలాగే కూలీలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా నీడ ,నీరు, ప్రథమ చికిత్స విభాగం వసతుల్ని సమకూర్చి ఉంచాలని పంచాయతీ అధికారులకు తెలియజేశారు. తరువాత అమ్మ ఆదర్శ పాఠశాల పథకంలో భాగంగా గ్రామాలలోని మండల పరిషత్ పాఠశాలలో జరుగుతున్న నిర్మాణం పనులను పరివేక్షించి తగు సూచనలు చేశారు. మిషన్ భగీరథ వాటర్ ట్యాంకులను , పైప్ లైన్లను సందర్శించి తాగునీటి సమస్య లేకుండా చూసుకోవాలని అధికారులకు తెలియజేశారు.ఈ రెండు గ్రామాల పర్యటనలో ఎంపిడిఓ సత్యనారాయణ గౌడ్,గంగిపల్లి మరియు రామారావు పేట గ్రామ పంచాయితీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.