ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఎంపిడిఓ

మందమర్రి, నేటిధాత్రి:-

మండలంలోని శంకర్ పల్లి, సారంగపల్లి గ్రామపంచాయతీలలో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న పనులను శుక్రవారం మండల ఎంపిడిఓ ఎన్ రాజేశ్వర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఉపాధి హామీ కూలీలకు తగు సలహాలు సూచనలు అందజేశారు. అదేవిధంగా ఆయా గ్రామ పంచాయతీ లలోని నర్సరీలను సందర్శించి, ఎండలు నుండి మొక్కల సంరక్షణ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు మార్గదర్శకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి (ఎంపిఓ) బి బీరయ్య, ఈసీ రఘు, పంచాయతీ కార్యదర్శులు, టిఏ, ఎఫ్ఏలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *