మున్నూరుకాపు జిల్లా అధ్యక్షులు పారా నాగేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా ఖమ్మంలో ఆత్మీయ సమ్మేళనం
ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి అజయ్ కుమార్,ఎంపీ రవిచంద్ర, పలువురు ప్రముఖులు
ఖమ్మం జిల్లా నేటి ధాత్రి
మున్నూరుకాపు సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు, బీఆర్ఎస్ నాయకులు పారా నాగేశ్వరరావు పుట్టినరోజు ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా ఆయన ఇంటి వద్ద శుక్రవారం ఉదయం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మంత్రి అజయ్ కుమార్ తదితర ప్రముఖులతో కలిసి హాజరై కేక్ కట్ చేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఖమ్మం సీక్వెల్ 12వ డివిజన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో పారా నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో హాజరై శుభాకాంక్షలు చెప్పారు.ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర, మంత్రి అజయ్ కుమార్ కేక్ కట్ చేయించి నాగేశ్వరరావుకు తినిపించి హ్యాపీ బర్త్ డే తెలిపారు.ఈ సమ్మేళనానికి నగర మేయర్ నీరజ,సుడా ఛైర్మన్ బచ్చు విజయ్ కుమార్, ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు చిన్ని కృష్ణారావు, స్థానిక కార్పోరేటర్ కర్ణాటి కృష్ణ, నాగేశ్వరరావు సోదరుడు పారా వెంకటేశ్వరరావు, వియ్యంకులు జాబిశెట్టి శ్రీనివాసరావు,జర్నలిస్టుల సంఘం జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ, బీఆర్ఎస్ నాయకులు శీలంశెట్టి వీరభద్రం తదితరులు హాజరై శుభాకాంక్షలు చెప్పారు.