MP Meets Nitin Gadkari Over Highway Development
కేంద్ర మంత్రి కలిసిన ఎంపీ సురేష్ కుమార్ శెట్కార్, చైర్మన్ నాగేష్ శెట్కార్
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఢిల్లీలోని కేంద్ర రహదారి మరియు రవాణా శాఖ మంత్రి నితిన్ గాడ్కరి గారి కార్యాలయంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ శెట్కార్ , నారాయణాఖేడ్ మున్సిపల్ చైర్మన్ నాగేష్ శెట్కార్ గారు మర్యాదపూర్వకంగా కలిసి పలు అభివృద్ధి అంశాలపై చర్చించారు.ఈ సందర్భంగా నేషనల్ హైవే 161(B) నిజాంపేట్ – నారాయణాఖేడ్ మీదుగా కర్ణాటక సరిహద్దు వరకు ₹520 కోట్ల నిధులు మంజూరు చేసి పనులు కొనసాగుతున్న విషయంపై మంత్రి గారికి కృతజ్ఞతలు తెలిపారు.అదేవిధంగా, కర్ణాటక బోర్డర్ నుండి బీదర్ వరకు మిగిలిన 8 కిలోమీటర్ల రహదారికి కూడా నిధులు మంజూరు చేసి, 161(B) హైవేతో అనుసంధానం చేయాలని విజ్ఞప్తి చేశారు.జహీరాబాద్ చెక్ పోస్ట్ నుండి బీదర్ వరకు న్యాల్కల్ నుండి గంగ్వార్ వరకు ట్రాఫిక్ పెరగడం తో 6 లైన్ రోడ్డు కు ప్రతిపదన కోరడం జరిగింది ఇక నూతన నారాయణాఖేడ్ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం కేంద్రం నుండి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు.
ఈ అంశాలపై కేంద్ర మంత్రి నితిన్ గాడ్కరి గారు సానుకూలంగా స్పందించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
