విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న ఎంపీ ఓ వేణుమాధవ్ ను వెంటనే సస్పెండ్ చేయాలి

బొల్లంపల్లి సంతోష్ గౌడ్

ముత్తారం :- నేటి ధాత్రి

విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న మండల పంచాయతీ అధికారి (ఎంపిఓ) వేణుమాధవ్ ను వెంటనే ఉన్నతాధికారులు సస్పెండ్ చేయాలని గ్రామానికి చెందిన బెల్లంపల్లి సంతోష్ గౌడ్ ఒక ప్రకటనలో కోరారు. ముత్తారం మండలంలోని ఖమ్మంపల్లి గ్రామపంచాయతీ పరిధిలో గల పకృతి వనం పార్కులో మొక్కలు ఎండిపోతున్నాయని పలుమార్లు ముత్తారం ఎంపీఓ కు తెల్పిన మరియు పలు పత్రికలలో కథనాలు వచ్చినప్పటికీ స్పందించలేదని, పంచాయతీకి ట్రాక్టర్ మరియు వాటర్ ట్యాంక్ పదిమంది సిబ్బంది 10 బోర్లు ఉన్నప్పటికీ నీరు కొట్టకుండా మూడు ఎకరాల పకృతి వనంలో చెట్లు ఎండీపోవడానికి కారణమైనాడని ఆవేదన వ్యక్తం చేశారు, అంతేకాకుండా రంగయ్య పల్లె వద్ద గల ప్రభుత్వ బోరు పంచాయతీ కరెంట్ మీటర్ గల బోరు నీళ్లను ఎంపీఓ వేణుమాధవ్ ఇసుక క్వారీలా దుమ్ము లేవకుండా నీళ్లు కొడుతూ నెలకు రూ. 50.000/- వేలు తీసుకుని గుత్తేదారకు నీళ్లు అమ్ముకుంటున్నాడని, ఇదేమిటి అని ప్రశ్నిస్తే కరెంటు మీటరు బిల్లు వాటర్ ట్యాంక్ నిర్వహణ చేసే వ్యక్తి కడతాడు అంటూ విధుల పట్ల నిర్లక్ష్యం మరియు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న ఎంపీవో ను వెంటనే సస్పెండ్ చెయ్యాలని బొల్లంపల్లి సంతోష్ కుమార్ గౌడ్ ఉన్నతాధికారులను డిమాండ్ చేశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!