తలకొండపల్లి /నేటి ధాత్రి
తలకొండపల్లి మండలంలోని గట్టు ఇప్పలపల్లి గ్రామంలో నూతన బ్యాంకును ఏర్పాటు చేయాలని గ్రామస్తులు శనివారం ఎంపీ మల్లురవిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. గ్రామంలో బ్యాంకు లేకపోవడంతో సుదూర ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తుందని, వికలాంగులు, వృద్ధులు అవస్థలు పడుతున్నారు అన్నారు. బ్యాంకును ఏర్పాటు చేయాలని ఎంపీ మల్లు రవిని కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు ప్రశాంత్ రెడ్డి, సీనియర్ నాయకులు రేణురెడ్డి, ఇందికంటి శివకుమార్ గౌడ్, బొడ్డే కిషన్, మధుసూదన్ రెడ్డి, సురేష్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.