మహిళా సమాన హక్కులకై ఉద్యమించాలి

ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి నలిగంటి రత్నమాల

భూపాలపల్లి నేటిధాత్రి

అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఐద్వా సి ఐ టి యు డివైఎఫ్ఐ ఎస్ ఎఫ్ ఐ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జిల్లా సదస్సు జరిగింది ఈ సదస్సుకు వంగాల లక్ష్మి సి ఐ టి యు జిల్లా ఉపాధ్యక్షులు బందు సాయిలు అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా హాజరైన ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షులు నళిగంటి రచన మాల మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని కార్మికులు మహిళలు యువత విద్యార్థులు ఐక్యంగా ఓకే వేదికలపై అంతర్జాతీయ పోరాట స్ఫూర్తిని తెలియజేయడం అభినందదాయకం అన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని బూర్జువా భూస్వామ్య పార్టీలు ఒక వేడుక నిర్వహిస్తున్నాయని అదే మహిళా సాధికారతగా చెప్పుకోవడం జరుగుతుందన్నారు మహిళా సాధికారత అంటే మహిళలు సామాజిక. ఆర్థిక. రాజకీయ రంగాల్లో తమ పాత్ర నిర్వహించినప్పుడే మహిళా సాధికారత దేశ ప్రధాని మోడీ నిత్యం బేటి బచావో నినాదాలు చేస్తూ. మహిళలకు రక్షణ కల్పించలేదన్నారు ఉత్తర ప్రదేశ్ వంటి బీజేపీతో రాష్ట్రాల్లో మహిళలపై ఆకృత్యాలు నిత్య కృత్యం అయ్యాయన్నారు మహిళలను కార్మిక రికార్డుల్లో నుంచి రెండు కోట్ల మందిని తొలగించడం దుర్మార్గమైన చర్య అన్నారు ఇప్పటికైనా శ్రామిక మహిళలందరికీ సమాన వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ సదస్సులో ఐద్వా జిల్లా కార్యదర్శి సంగం ప్రీతి డి వై ఎఫ్ ఐ కో కన్వీనర్ కవిత సిఐటియు నాయకులు రమేష్ వికలాంగుల సంఘం జిల్లా కార్యదర్శి శేఖర్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాజు కె.విపిఎస్ నాయకులు శ్రీధర్ రజిత రజిని ఉషారాణి స్వాతి స్వప్న తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!