Collector Inspects Ration Rice Distribution
సన్నబియ్యం పంపిణీ పరిశీలన
చౌక ధరల దుకాణంలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
సిరిసిల్ల(నేటి ధాత్రి):
సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చౌక ధరల దుకాణంలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిరిసిల్ల పట్టణంలోని రాజీవ్ నగర్ లో ఉన్న చౌక ధరల దుకాణంలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసి.. ఆన్లైన్ లో లబ్దిదారుల వివరాల నమోదు .. సన్న బియ్యం పంపిణీని పరిశీలించారు.
ప్రభుత్వం రేషన్ కార్డు లబ్ధిదారులకు ఒకేసారి మూడు నెలల బియ్యం పంపిణీ చేయాలని ఇప్పటికే అన్ని చౌక ధరల దుకాణాలకు అందించింది. ఈ సందర్భంగా పలువురు రేషన్ కార్డుల లబ్ధిదారులతో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడారు. ఇప్పటిదాకా ఎందరు లబ్ధిదారులు సన్న బియ్యం తీసుకువెళ్ళారు? పంపిణీలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని రేషన్ డీలర్ ను జిల్లా కలెక్టర్ ఆరా తీశారు.
పరిశీలనలో సిరిసిల్ల డిప్యూటీ తహసీల్దార్ భాస్కర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
