మోడీ చిత్రపటానికి బిజెపి ఆధ్వర్యంలో పాలాభిషేకం.

BJP BJP

మోడీ చిత్రపటానికి బిజెపి ఆధ్వర్యంలో పాలాభిషేకం

సిరిసిల్ల టౌన్: ( నేటిధాత్రి)

 

 

ఈరోజు సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో భారత దేశవ్యాప్తంగా కులగణనకు మోదీ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నందునా బుదవారం జరిగిన రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశంలో, జనాభా లెక్కలతోపాటే కులగణనను నిర్వహించాలని తీర్మానించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ, కర్ణాటకల్లో కులగణన తప్పుల తడకగా లెక్కలు చేసి మళ్లీ లెక్కిస్తామని ప్రకటన చేసిన కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఈ అంశాన్ని విస్మరించిందని అధికారం పోయాక విమర్శలు తప్ప చేసేది ఏం లేదు కానీ మోదీ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని దేశవ్యాప్తంగా బీసీ, sc, st లు మరియుప్రతి కులస్తులు అందరూ స్వాగతిస్తున్నారు ఈ కులగణణ ‘సమ్మిళిత వృద్ధి’ వేగం గా పుంజుకుంటుందని తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది సెప్టెంబరులో జన, కులగణనను ప్రారంభించి, రెండేళ్లలో ముగించనున్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ చిత్ర పటానికి భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ మ్యాన రాంప్రసాద్ జిల్లా కార్యదర్శి గజ బింకర్ చందు, పట్టణ ప్రధాన కార్యదర్శి ఎనగంటి నరేష్ జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు పండగ మాధవి, బీజేవైఎం ఉపాధ్యక్షుడు దూడం శివప్రసాద్, పట్టణ ఉపాధ్యక్షులు చొప్పదండి అంజన్న, ఊరగొండ రాజు, మోర శ్రీహరి, పంపరి అర్జున్, చొప్పదండి శ్రీనివాస్, కోడం శ్రీనివాస్, ఇంజాపూరి మురళి, దుమాల శ్రీకాంత్, మహేశుని అనిల్, దూడం సురేష్, టవటం రాజలింగం, నాగుల శ్రీనివాస్, చొక్కి శీను, పచ్చునూరి సురేష్, వేముల సురేష్, గాలి శీను, కర్నే రేవంత్, కోడం రవి, తాటిపాముల విష్ణు, జింగం శ్రీనివాస్, వేముల పోశెట్టి, నల్లగొండ సాయిచంద్, భాగయ్య, ఆడెపు వేణుమాధవ్, చిలుక శ్రీకాంత్ కర్నె గణేష్, మరియు భారతీయ జనతా పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!