లక్షెట్టిపేట (మంచిర్యాల) నేటిదాత్రి:
పట్టణంలోని మున్సిపాలిటీ పరిధిలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో సోమవారం రోజున విద్యార్థులకి మాక్ పోలింగ్ నిర్వహించారు. పదవ తరగతి విద్యార్థులు ప్రెసిడెంట్,
వైస్ ప్రెసిడెంట్, కల్చరల్ ఇంచార్జ్, స్పోర్ట్స్ ఇన్చార్జ్ తదితర స్థానాలకి ఒక స్థానానికి సుమారు ఐదుగురు విద్యార్థులు పోటీపడ్డారు. ఎల్కేజీ నుండి పదవ తరగతి విద్యార్థులు సుమారు 950 మంది విద్యార్థులు వారికి నచ్చిన అభ్యర్థికి ఓటు వేయడం జరిగింది. విద్యార్థులందరూ చాలా ఆసక్తిగా మాక్ పోలింగ్ లో పాల్గొనడం జరిగింది. పాఠశాల ప్రిన్సిపాల్ చిందం చంద్రశేఖర్ మాట్లాడుతూ ఈనెల నవంబర్ 30 తేదీన రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో విద్యార్థులకు ఈ మాకు పోలింగ్ నిర్వహించామని తెలియజేశారు. ఈ కార్యక్రమం వల్ల ఎలక్షన్ లో అభ్యర్థి నామినేషన్ వేయడం దగ్గర నుండి, ఎన్నికల ప్రచారం, ఓటింగ్ ప్రక్రియ, ఏ విధంగా జరుగుతుందో విద్యార్థులకు ప్రాక్టికల్ గా చేసి చూపించామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది ఎన్నికల అధికారులుగా పని చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు ఎంబడి రమేష్ , పెట్టెం తిరుపతి, పాఠశాల పేరెంట్స్ కమిటీ ప్రెసిడెంట్ రమేష్ చంద్ జైన్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.