పూరేడు గుట్ట సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకున్న ఎమ్మెల్సీ సిరికొండ.

చిట్యాల, నేటి దాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని వెంచరామి గ్రామ శివారులోని పూరేడు పుట్ట వద్ద వెలిసిన శ్రీ సమ్మక్క సారలమ్మ దేవతల గద్దెలను ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి బుధవారం రోజున దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మినీ మేడారాలుగా విలసిల్లుతున్నటువంటి సమ్మక్క సారలమ్మ గద్దెలని జాతరకు వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకొని తాను అధికారంలో ఉన్న సమయంలోనే సంపూర్ణంగా అభివృద్ధి చేయడం జరిగిందని ఆయన తెలిపారు. పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు మరిన్ని సౌకర్యాలు కల్పించి శాశ్వత మరమ్మతులు చేపట్టాలని ఆయన కోరారు అనంతరం నైన్ పాక గ్రామ శివారులో ఉన్న శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయాన్ని సందర్శించి ప్రజా క్షేమం కోసం పూజలు నిర్వహించారు. ఏకశిలకు నలువైపులా దేవత మూర్తులు కొలువైన ఈ దేవాలయానికి మరమ్మతులు చేపట్టి అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి తను కట్టుబడి ఉన్నానని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆయన వెంట టేకుమట్ల జెడ్పిటిసి పులి తిరుపతిరెడ్డి బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు చింతల రమేష్ ముదిరాజ్ పుల్లూరు సతీష్ కురుమిళ్ళ కుమారస్వామి ఎండి శంషుద్దీన్ కచ్చు మల్లేష్ శ్రీనివాస్ బొమ్మ శరత్ సంగ రాజేందర్ మాజీ సర్పంచ్ సిద్ధంకి భాస్కర్ నందు నాయక్ దొడ్డే శంకర్ తీగల బాలకృష్ణ జన్నే యుగంధర్ గొల్లపల్లి రాజు వెంకట్ నాయక్ ఉప్పుల కిరణ్ గురుకుంట్ల కిరణ్ కోడల రాజమల్లు కుర్మిళ్ళ ప్రశాంత్ పుల్లూరు నారాయణ పార్టీ ఇతర ప్రాంతాల జిల్లా నాయకులు లెంకల రాజిరెడ్డి నరసింహారెడ్డి గోపు బిక్షపతి శ్రీరాములు వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *