
అనిరుధ్ రెడ్డి, రాజేశ్ రెడ్డి.
పత్రికలు ప్రజలకు.. ప్రభుత్వానికి వారధిగా ఉండాలి.
సూర్య దినపత్రిక క్యాలండర్ ఆవిష్కరించిన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు అనిరుధ్ రెడ్డి, రాజేశ్ రెడ్డి.
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండల కేంద్రంలోని హిల్ పార్క్ హోటల్ ఆవరణలో శుక్రవారం రోజు సూర్య తెలుగు దినపత్రిక 2024 సంవత్సర క్యాలెండర్ ను పాత్రికేయుల కోరిక మేరకు సూర్య పత్రిక క్యాలెండర్ ను రాష్ట్ర రవాణా శాఖ & బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ. గత ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేయలేదని, తమ ప్రభుత్వ హయాంలో వారికి తగిన ప్రాధాన్యత ఇస్తూ వారి సంక్షేమం కోసం కృషి చేస్తామని అన్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ వెంట జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి,నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
> బీఆర్ఎస్ నాయకులు బట్టలు చించుకోకండి
> రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
>”కొల్లూరు” పర్యటనలో టిఆర్ఎస్ పై విమర్శనాస్త్రాలు
> శ్రీ చింతల పూరి చిన్మయ స్వామి మఠం స్వాగత తోరణ ప్రారంభోత్సవం
హాజరైన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే జిఎంఆర్.
తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు ఎక్కుపెట్టారు. మహబూబ్ నగర్ జిల్లా నవాబ్ పేట మండలం కొల్లూరు గ్రామంలో నిర్మించిన శ్రీ చింతల పూరి చిన్మయ స్వామి మఠం స్వాగత తోరణం (ముఖ ద్వారం) ప్రారంభోత్సవంలో శుక్రవారం పాల్గోన్నారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు, షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి (జిఎంఆర్) మరియు శ్రీశైల పీఠాధిపతి డాక్టర్ చెన్న సిద్ధిరామ పండితారాద్య శివాచార్య, శ్రీశైలం దేవస్థానం పూజారి గంతల నాగరాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కార్యక్రమాల అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు.
కాలేశ్వరం కడితే కృంగిపోయిందని, పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తి చేయలేదని అసలు రాష్ట్రానికి చెప్పుకోదగ్గ పని ఏం చేశారని? మంత్రి ప్రభాకర్ ప్రశ్నించారు. ఊరికే బీఆర్ఎస్ నాయకులు బట్టలు చింపుకోవద్దని పద్ధతిగా ఉండాలంటూ హితవు పలికారు. ప్రజల చేత తిరస్కరింపబడ్డాక కూడా బీఆర్ఎస్ నాయకులు అహంకారపూరితమైన మాటలు మాట్లాడడం తగదని సూచించారు. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఎలా చేపడుతాము చూడండి అంతవరకు ఎదురుచూడండి అప్పుడే విమర్శలకు దిగడం సమంజసం కాదంటూ హితవు పలికారు. అసెంబ్లీలో కూర్చుని బయటికి వచ్చి ఏదో చెమటోడ్చి కష్టపడ్డట్టు శ్వేత పత్రం అంటూ గగ్గోలు పడుతున్నారని విమర్శించారు. విభజన హామీలు కేంద్రం నుండి ఎన్ని తెచ్చారని మంత్రి ప్రభాకర్ ప్రశ్నించారు.