డ్రిప్ మరియు స్ప్రింక్లర్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే
చిట్యాల నేటిధాత్రి :
జిల్లా ఉద్యాన శాఖ అధికారి సునీల్ కుమార్ ఆధ్వర్యంలో చిట్యాల మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద రైతులకు రాయితీపై మంజూరుైన డ్రిప్ మరియు స్ప్రింక్లర్ పరికరాల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భూపాలపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన రైతులందరూ డ్రిప్ మరియు స్ప్రింక్లర్ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇటీవల ముఖ్యమంత్రి గారు నిర్వహించిన సమావేశంలో, ప్రతి అర్హ రైతుకు ఉద్యాన శాఖ ద్వారా సబ్సిడీ పథకాలను అందించాలని ఆదేశించారని తెలిపారు.అలాగే, డ్రిప్ మరియు స్ప్రింక్లర్ పద్ధతుల వినియోగం వలన తక్కువ నీటితో ఎక్కువ దిగుబడులు సాధ్యపడతాయని, ఇది సమర్థవంతమైన నీటి వినియోగానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. రైతులు పంట మార్పిడి విధానాన్ని పాటించాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీదేవి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి మాజీ సర్పంచ్ ముకిరాల మధు వంశీకృష్ణ జిల్లా అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య టౌన్ అధ్యక్షులు బుర్ర లక్ష్మణ్ గౌడ్, సిగ్నెట్ కంపెనీ ఏరియా మేనేజర్ రాజు, జైన్ కంపెనీ ప్రతినిధి శ్యామ్ సుందర్ గారు, తదితరులు మరియు పలువురు లబ్ధిదారులు పాల్గొన్నారు.