శ్రేయన్స్ తండ్రిని పరామర్శించిన ఎమ్మెల్యే.

MLA Janampalli Anirudh Reddy MLA Janampalli Anirudh Reddy

శ్రేయన్స్ తండ్రిని పరామర్శించిన ఎమ్మెల్యే

జడ్చర్ల /నేటి ధాత్రి

 

జడ్చర్ల పట్టణంలోని మూడవ వార్డులో రెండు రోజుల క్రితం ఇంటి ముందు సైకిల్ పై వెళ్తుండగా.. విద్యుత్ వైరు తగిలి కరెంట్ షాక్ తో శ్రేయన్స్ (10) బాలుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి శ్రేయాన్స్ తండ్రి బొక్క రాఘవేందర్ ను పరామర్శించారు. ధైర్యం కోల్పోకూడదని ఓదార్చారు. కరెంట్ షాక్ తో శ్రేయాన్స్ చనిపోవడం బాధాకరమని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!