శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం లో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కుటుంబ సభ్యులు .
ప్రత్యేక పూజలు
వనపర్తి నేటిధాత్రి.
వనపర్తి జిల్లా కేంద్రంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కుటుంబ సభ్యులు మంగళవారం ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామిని, అమ్మవారిని, ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను ఆలయ చైర్మన్ ధర్మకర్త అయ్యలూరి రఘునాథ శర్మ,ఆలయ పురోహితులు ఆశీర్వదించారు. పూజలో వనపర్తి మార్కెట్ యార్డు చైర్మన్ బండారు శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత 33 వ వార్డు ఎస్ ఎల్ ఎన్ మీడిదొడ్డి రమేష్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నారు. అనంతరం భక్తులకు ఆలయ పురోహితులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ మేరకు వనపర్తి టౌన్ ఎస్. ఐ హరి ప్రసాద్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
