నల్లబెల్లి, నేటి ధాత్రి:
మండలంలోని బజ్జు తండా గ్రామానికి చెందిన తేజ వత్ వెంకటేష్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించగా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతుని స్వగృహానికి చేరుకొని ఆయన పార్థివదేహంపై పూలమాలవేసి ఘన నివాళులర్పించారు అనంతరం అంతిమయాత్రలో పాల్గొన్నారు ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షుడు బానోతు సారంగపాణి, నాయకులు ఊడుగుల ప్రవీణ్ గౌడ్, కక్కెర్ల శ్రీనివాస్ గౌడ్, పాలెపు రాజేశ్వరరావు, విడియాల ప్రభాకర్ రావు, ఉదయ్ సింగ్, ఎంపిటిసి లక్ష్మీ సౌమ్య, సర్పంచ్ తిరుపతి పద్మ, తదితరులు పాల్గొన్నారు.