ప్రభుత్వ పాఠశాలలో ఎగ్జామ్స్ కిట్ల అందజేత:
చేర్యాల: నేటిధాత్రి
విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉండాలని, తన వంతుగా పరీక్షలకు ఉపయోగపడే విధంగా జనగామ ఎమ్మెల్యే డాక్టర్.పల్లా రాజేశ్వర్ రెడ్డి నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఎగ్జామ్ కిట్లను అందించి అండగా నిలుస్తున్నారు..ఈ సందర్బంగా విద్యార్థులు, తల్లిదండ్రులు ఎమ్మెల్యే పల్లాకు కృతజ్ఞతలు తెలుపు తున్నారు..కాగా ముఖ్యంగా పదో తరగతి విద్యార్థి జీవితంలో కీలకమని, త్వరలో జరగబోయే పరీక్షలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు 10/10 జీపీఏ సాధించి పాఠశాలలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని ఎమ్మెల్యే డాక్టర్.పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆకాంక్షించారు.
ఇందులో భాగంగానే నియోజకవర్గంలోని చేర్యాల, కొమురవెల్లి, మద్దూర్ మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణి కార్యక్రమం చేపట్టారు..ఈ సందర్బంగా ఎమ్మెల్యే డాక్టర్.పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు స్థానిక ప్రజా ప్రతినిధులు చేతుల మీదుగా విద్యార్థులకు పరీక్ష సామాగ్రిని అందచేశారు. సోమవారం చేర్యాల, కొమురవెల్లి మండలాల్లో అన్ని ప్రభుత్వ పాఠశాలలో, మద్దూర్ మండలంలో కొన్ని ప్రభుత్వ పాఠశాలలో పరీక్ష సామాగ్రిని అందచేశారు..ఈ సందర్బంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ..దూల్మెట మండలంతో పాటు మద్దూర్ మండలంలోని మిగిలిన పాఠశాలలో పరీక్ష సామాగ్రిని మంగళవారం అందచేయడం జరుగుతుందన్నారు.