
Nayini Invites CM to U-23 Athletics
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే నాయిని..
#అండర్ 23 అథ్లెటిక్స్ పోటీలకు ముఖ్యమంత్రిని ఆహ్వానించిన ఎమ్మెల్యే నాయిని..
హన్మకొండ, నేటిధాత్రి :
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నీ మర్యాదపూర్వకంగా కలిసిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అక్టోబర్ 16,17,18 తేదీలలో జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగే 5 వ ఓపెన్ అండర్ 23 అథ్లెటిక్ చాంపియన్ షిప్ పోటీలకు ముఖ్య అతిథులుగా హాజరు కావాలని కోరారు.
ఈ సందర్భంగా అథ్లెటిక్స్ కాంపిటీషన్ పోస్టర్ విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు శ్రీ వేం నరేందర్ రెడ్డి,స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శ్రీ శివసేన రెడ్డి,రాష్ట్ర అథ్లెటిక్ చైర్మన్ శ్రీ ఎర్రబెల్లి వరద రాజేశ్వర్ రావు,జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్,జిల్లా క్రీడా శాఖ అధికారి అశోక్ , జాయింట్ సెక్రటరీ సారంగం తదితరులు ఉన్నారు.